బాక్సాఫీస్ వద్ద ధరణి మాస్ ఊచకోత కొనసాగుతోంది. కేవలం రెండు రోజులకే 52 కోట్ల గ్రాస్ వసూలు కావడం చూసి నాని అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. షేర్ ఆల్రెడీ ముప్పై కోట్లకు దగ్గరగా వెళ్లిపోయింది. ఒకప్పుడు ఇది ఫుల్ రన్ లో రావడానికే కొన్ని నాని హిట్ సినిమాలు మూడు నాలుగు వారాలు తీసుకునేవి. అలాంటిది ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్ ఊచకోత అంటే చిన్న విషయం కాదు.
వీకెండ్ ఇంకో రెండు రోజులు ఉంది కాబట్టి ఈ ర్యాంపేజ్ ఇలాగే కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఏరియాల వారిగా దసరా రికార్డులు బయటికొస్తున్నాయి. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుని వాడుకోవడం వసూళ్ల మీద ప్రభావం చూపిస్తుందేమో అనుకుంటే రివర్స్ లో అదే పెద్ద ప్లస్ అయ్యింది. టాక్ వింటున్న పబ్లిక్ హైక్ ని పట్టించుకోకుండా టికెట్లు అడ్వాన్స్ గా కొనేస్తున్నారు. బరిలో ఇంకే పోటీ లేకపోవడం దసరాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తోంది.
రెండో రోజు వసూళ్ల పరంగా ఏపీ తెలంగాణలో మీడియం రేంజ్ మూవీస్ లో ఇప్పటిదాకా ఉప్పెన 6 కోట్ల 80 లక్షలతో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. దసరా ఓ ఎనభై లక్షల దాకా వెనుకబడి ఉన్నా ఫైనల్ లెక్కల్లో ఇంకొంత స్పష్టత రావాలని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న నేపథ్యంలో వేచి చూడాలి.
ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ మొదటి వారం గడవకుండానే జరిగిపోవడం ఖాయం. అటు హిందీలో దసరా పికప్ స్లోగా ఉంది. అజయ్ దేవగన్ భోళాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే నార్త్ ఆడియన్స్ నాని మూవీ గురించి తెలుసుకుని థియేటర్లకు వెళ్లడం ప్రారంభించారు. కర్ణాటకలో పర్వాలేదనిపించుకోగా తమిళనాడులో విడుతలై 1, పాతుతల కాంపిటీషన్ వల్ల అక్కడ దసరాకు ఇబ్బందులు తప్పలేదు. ఓవర్సీస్ లో నానిని ఇలాంటి కంటెంట్ తో ఈ రేంజ్ లో రిసీవ్ చేసుకోవడం ఆశ్చర్యకరం. ఫైనల్ ఫిగర్స్ మాత్రం చాలా షాకింగ్ గా ఉండబోతున్నాయి
This post was last modified on April 1, 2023 12:47 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…