సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టింది సమంత. చెన్నై, ముంబై లో ప్రమోషనల్ ఇంటర్యూలు ఇస్తూ శాకుంతలం గురించి, తన లైఫ్ గురించి చెప్పుకుంటుంది. అయితే సమంత కొన్నాళ్లుగా తెలుగు మీడియాకి దూరంగా ఉంటుంది.
యశోద టైంలో కూడా తెలుగు మీడియా ముందుకు రాలేదు సమంత. ఆ టైమ్ లో సుమ తో ఒక కామన్ ఇంటర్వ్యూ మాత్రమే చేసింది. అయితే అప్పుడు సామ్ అనారోగ్యంతో ఉందని మీడియా లైట్ తీసుకుంది. కానీ తాజాగా శాకుంతలం విషయంలోనూ సమంత తెలుగు మీడియాకి దూరంగా ఉంటుంది.
ఇటీవలే రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ కి కూడా సామ్ హాజరులేదు. అక్కడ మీడియా నుండి ఎదురయ్యే క్వశ్చన్స్ ఫేస్ చేయలేకే అటెండ్ అవ్వలేదనే డిస్కషన్ నడుస్తుంది. టీజర్ లాంచ్ కి హాజరైంది కానీ అప్పుడు తెలుగు మీడియా కి నో క్వశ్చన్ అంటూ టీమ్ ముందే చెప్పేశారు.
ఏదేమైనా తెలుగు మీడియాకి సమంత కాస్త దూరంగానే ఉంటుంది. బహుశా చైతు గురించి, తన హెల్త్ గురించి క్వశ్చన్స్ ఎదురవుతాయని సామ్ ఊహించి అందుకే కాస్త దూరంగా ఉంటుంది కాబోలు. కానీ రిలీజ్ దగ్గర్లో మాత్రం తెలుగు మీడియాను సామ్ ఫేస్ చేయాల్సిందే. సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సిందే.
సంక్రాంతి తర్వాత సరైన భారీ చిత్రాలు లేక వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ‘పెద్ది’ సినిమా ఊపిరులూదుతోంంది. టాక్ ఎలా ఉందన్నదాంతో…
కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం వరకు మన ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాదు. జైలర్…
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…
తెలుగు సినీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యంత ఆకర్షణీయమైన స్క్రీన్లో సినిమా చూసే అవకాశం…
అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…
సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. ప్రత్యేకించి…