సమంత పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టింది సమంత. చెన్నై, ముంబై లో ప్రమోషనల్ ఇంటర్యూలు ఇస్తూ శాకుంతలం గురించి, తన లైఫ్ గురించి చెప్పుకుంటుంది. అయితే సమంత కొన్నాళ్లుగా తెలుగు మీడియాకి దూరంగా ఉంటుంది.
యశోద టైంలో కూడా తెలుగు మీడియా ముందుకు రాలేదు సమంత. ఆ టైమ్ లో సుమ తో ఒక కామన్ ఇంటర్వ్యూ మాత్రమే చేసింది. అయితే అప్పుడు సామ్ అనారోగ్యంతో ఉందని మీడియా లైట్ తీసుకుంది. కానీ తాజాగా శాకుంతలం విషయంలోనూ సమంత తెలుగు మీడియాకి దూరంగా ఉంటుంది.
ఇటీవలే రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ కి కూడా సామ్ హాజరులేదు. అక్కడ మీడియా నుండి ఎదురయ్యే క్వశ్చన్స్ ఫేస్ చేయలేకే అటెండ్ అవ్వలేదనే డిస్కషన్ నడుస్తుంది. టీజర్ లాంచ్ కి హాజరైంది కానీ అప్పుడు తెలుగు మీడియా కి నో క్వశ్చన్ అంటూ టీమ్ ముందే చెప్పేశారు.
ఏదేమైనా తెలుగు మీడియాకి సమంత కాస్త దూరంగానే ఉంటుంది. బహుశా చైతు గురించి, తన హెల్త్ గురించి క్వశ్చన్స్ ఎదురవుతాయని సామ్ ఊహించి అందుకే కాస్త దూరంగా ఉంటుంది కాబోలు. కానీ రిలీజ్ దగ్గర్లో మాత్రం తెలుగు మీడియాను సామ్ ఫేస్ చేయాల్సిందే. సినిమాను ప్రమోట్ చేసుకోవాల్సిందే.
This post was last modified on March 30, 2023 8:29 am
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…