శ్రుతి హాసన్ను తండ్రికి తగ్గ తనయురాలు అనలేం కానీ.. కమల్ హాసన్ తనను ఎందుకు సినిమాల్లోకి తెచ్చానని ఫీలయ్యేలా మాత్రం చేయలేదు. నటిగా, సింగర్గా, మ్యుజీషియన్గా సత్తా చాటుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది శ్రుతి.
కథానాయికగా పాతిక సినిమాల దాకా చేసిన శ్రుతి.. తండ్రి సినిమా ‘ఈనాడు’కు సంగీతం అందించడమే కాక.. కొన్ని సినిమాల్లో పాటలు పాడింది. ఇప్పుడు ఆమె కొత్త ప్రతిభను బయట పెట్టుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆమె రచయిత అవతారం ఎత్తబోతోంది. కథ చెప్పే కళను నేను ఎప్పుడూ ఆరాధిస్తా.
ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్క్రిప్టు అందించడం నా కల. సినీ పరిశ్రమలో నా కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుయ చూస్తున్నా. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది’’ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రుతి తెలిపింది. ఆమె మాటల్ని బట్టి చూస్తే శ్రుతి స్క్రిప్ట్ రైటర్గా మారినట్లు కనిపిస్తోంది. మరి రచయితగా ఆమె తొలి ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి.
కమల్ ఎన్నో కథలు రాయడమే కాక సొంతంగా డైరెక్ట్ చేశాడు కూాడా. తండ్రి బాటలో ఆమె కూడా తన టాలెంట్ చూపిస్తుందని ఆశించవచ్చు. ఇక నటిగా శ్రుతి కెరీర్ విషయానికి వస్తే.. మధ్యలో కొన్నేళ్లు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె.. ‘క్రాక్’తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సంక్రాంతికి ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ విడుదలై మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
This post was last modified on March 28, 2023 5:03 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…