ఇంకో మూడే రోజుల్లో దసరా థియేటర్లలో వచ్చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద సరైన మాస్ బొమ్మ వచ్చి చాలా కాలమవుతున్న నేపథ్యంలో అభిమానులతో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాడు. ప్రత్యేకంగా నార్త్ ఇండియా వెళ్లి నగరాలు సందర్శించి, అక్కడి జనాలను పలకరించి, రోడ్ షోలు చేసి, ఫేమస్ ఫుడ్ పాయింట్ల వద్ద ఛాట్లు గట్రా తిని తనవంతుగా శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు.
హైదరాబాద్ వచ్చాక అడిగినవారికి నో అనకుండా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయింది. అంతా బాగానే కనిపిస్తోంది కానీ హిందీ వెర్షన్ విషయంలో నిర్మాతలు కాసింత అశ్రద్ధ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుపెట్టలేదు. ముంబై, ఢిల్లీ, పూణే, కోల్కతా ఇలా ఏ ప్రధాన నగరంలో చూసినా టికెట్లు అందుబాటులో ఉంచలేదు.
అదే రోజు పోటీగా వస్తున్న అజయ్ దేవగన్ భోళా (ఖైదీ రీమేక్) సేల్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. నార్త్ సైడ్ దసరాకు ఇది ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. పైగా అది త్రీడిలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్. దాన్ని తట్టుకోవాలంటే దసరాని ఓ రేంజ్ లో అక్కడి ఆడియన్స్ కి రీచ్ చేయాలి. ముందే బుక్ చేసుకోవాలన్న ఆసక్తి పెంచాలి.
వీటిలో ఒక బాధ్యత పూర్తయ్యింది కానీ రెండోది ఇంకా నెరవేరాలి. వీలైనంత త్వరగా బుకింగ్స్ పెట్టేలా చేయాలి. హక్కులను అమ్మగానే సరిపోదు. దానికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయాలి. నానికి ఇదంతా తెలుసో లేదోనని ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. భోళాని ఫేస్ చేయడం అంత సులభం కాదు. పైగా దాన్ని సపోర్ట్ చేయడం కోసం ముంబై మీడియా దసరాని తక్కువ చేసినా ఆశ్చర్యం లేదు. మొదటి ప్యాన్ ఇండియా ప్రయత్నంగా నాని దీని మీద పెట్టుకున్న ఆశలు అన్నిఇన్ని కావు. క్లిక్ అయితే నెక్స్ట్ రాబోయే సినిమాలకు అమాంతం బిజినెస్ పెరుగుతుంది
This post was last modified on March 28, 2023 7:23 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…