పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేనంత ఊపు చూపిస్తున్నారిప్పుడు. సినిమాల మీద ఆసక్తి లేదన్నట్లు కనిపిస్తూనే.. 2024 ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేలోపు తాను ఇచ్చిన అన్ని కమిట్మెంట్లనూ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. గత నెలలోనే మొదలైన ‘వినోదియ సిత్తం’ రీమేక్కు సంబంధించి అప్పుడే తన పని పూర్తి చేసేశాడు పవన్.
ఈ సినిమా కోసం మూడు వారాల డేట్లు కేటాయించి.. విరామం లేకుండా షూటింగ్లో పాల్గొన్న పవన్.. తన వరకు టాకీ పార్ట్ అంతా అవగొట్టేశాడు. మరి కొన్ని రోజుల్లోనే హరీష్ శంకర్ సినిమా కూడా మొదలు కాబోతోంది. ఆ సినిమా కోసం సెట్టింగ్ నిర్మాణం పూర్తయింది. షెడ్యూల్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగుతోంది చిత్ర బృందం.
మరోవైపు యువ దర్శకుడు సుజీత్తో పవన్ చేయనున్న సినిమాకు షూట్ మొదలుపెట్టేందుకు కూడా రంగం సిద్ధమవుతుండటం విశేషం. పవన్ చేస్తున్న, చేయబోయే సినిమాలన్నింట్లో మంచి క్రేజ్ ఉన్న చిత్రమిది. ఈ చిత్రానికి ‘ఓజీ‘ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లొకేషన్ల వేట సాగిస్తోంది సుజీత్ టీం.
ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్. దర్శకుడు సుజీత్, సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ కలిసి లొకేషన్లను పరిశీలిస్తున్న దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. లొకేషన్లు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ నెలాఖర్లో సెట్స్ మీదికి వెళ్లొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఐదారు నెలల్లో పవన్ ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
This post was last modified on March 27, 2023 6:32 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…