పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేనంత ఊపు చూపిస్తున్నారిప్పుడు. సినిమాల మీద ఆసక్తి లేదన్నట్లు కనిపిస్తూనే.. 2024 ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేలోపు తాను ఇచ్చిన అన్ని కమిట్మెంట్లనూ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. గత నెలలోనే మొదలైన ‘వినోదియ సిత్తం’ రీమేక్కు సంబంధించి అప్పుడే తన పని పూర్తి చేసేశాడు పవన్.
ఈ సినిమా కోసం మూడు వారాల డేట్లు కేటాయించి.. విరామం లేకుండా షూటింగ్లో పాల్గొన్న పవన్.. తన వరకు టాకీ పార్ట్ అంతా అవగొట్టేశాడు. మరి కొన్ని రోజుల్లోనే హరీష్ శంకర్ సినిమా కూడా మొదలు కాబోతోంది. ఆ సినిమా కోసం సెట్టింగ్ నిర్మాణం పూర్తయింది. షెడ్యూల్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగుతోంది చిత్ర బృందం.
మరోవైపు యువ దర్శకుడు సుజీత్తో పవన్ చేయనున్న సినిమాకు షూట్ మొదలుపెట్టేందుకు కూడా రంగం సిద్ధమవుతుండటం విశేషం. పవన్ చేస్తున్న, చేయబోయే సినిమాలన్నింట్లో మంచి క్రేజ్ ఉన్న చిత్రమిది. ఈ చిత్రానికి ‘ఓజీ‘ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లొకేషన్ల వేట సాగిస్తోంది సుజీత్ టీం.
ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్. దర్శకుడు సుజీత్, సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ కలిసి లొకేషన్లను పరిశీలిస్తున్న దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. లొకేషన్లు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ నెలాఖర్లో సెట్స్ మీదికి వెళ్లొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఐదారు నెలల్లో పవన్ ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
This post was last modified on March 27, 2023 6:32 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…