పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేనంత ఊపు చూపిస్తున్నారిప్పుడు. సినిమాల మీద ఆసక్తి లేదన్నట్లు కనిపిస్తూనే.. 2024 ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేలోపు తాను ఇచ్చిన అన్ని కమిట్మెంట్లనూ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. గత నెలలోనే మొదలైన ‘వినోదియ సిత్తం’ రీమేక్కు సంబంధించి అప్పుడే తన పని పూర్తి చేసేశాడు పవన్.
ఈ సినిమా కోసం మూడు వారాల డేట్లు కేటాయించి.. విరామం లేకుండా షూటింగ్లో పాల్గొన్న పవన్.. తన వరకు టాకీ పార్ట్ అంతా అవగొట్టేశాడు. మరి కొన్ని రోజుల్లోనే హరీష్ శంకర్ సినిమా కూడా మొదలు కాబోతోంది. ఆ సినిమా కోసం సెట్టింగ్ నిర్మాణం పూర్తయింది. షెడ్యూల్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేసుకుని రంగంలోకి దిగుతోంది చిత్ర బృందం.
మరోవైపు యువ దర్శకుడు సుజీత్తో పవన్ చేయనున్న సినిమాకు షూట్ మొదలుపెట్టేందుకు కూడా రంగం సిద్ధమవుతుండటం విశేషం. పవన్ చేస్తున్న, చేయబోయే సినిమాలన్నింట్లో మంచి క్రేజ్ ఉన్న చిత్రమిది. ఈ చిత్రానికి ‘ఓజీ‘ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లొకేషన్ల వేట సాగిస్తోంది సుజీత్ టీం.
ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్. దర్శకుడు సుజీత్, సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ కలిసి లొకేషన్లను పరిశీలిస్తున్న దృశ్యాలను ట్విట్టర్లో షేర్ చేశారు. లొకేషన్లు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ నెలాఖర్లో సెట్స్ మీదికి వెళ్లొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఐదారు నెలల్లో పవన్ ఈ సినిమాలన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
This post was last modified on March 27, 2023 6:32 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…