సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని నెమ్మదిగా అందరూ నమ్మేస్తున్న టైంలో అతని ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులే అతడిని మానసికంగా హింసించి, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారని అతడి తండ్రి కేసు పెట్టడం, ఎఫ్.ఐ.ఆర్.లో ఎన్నో తీవ్ర ఆరోపణలు చేయడంతో మళ్ళీ ఈ కేస్ హాట్ టాపిక్ గా మారింది.
సుశాంత్ చనిపోయిన నెల రోజుల తర్వాత అతనిపై ప్రేమంతా సోషల్ మీడియాలో ఒలకబోసిన రియా… ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని హోమ్ మినిష్టర్ కి ట్వీట్ పెట్టింది. పది రోజులు తిరిగే సరికి ఆమె మీదే కేస్ బుక్ అయింది. దీంతో తన తరఫున వాదించడానికి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కేసులు వాదించిన వకీలుని పెట్టుకుంది.
అత్యంత ఖరీదైన ఆ లాయర్ ని భరించే ఆర్ధిక స్తోమత ఒక స్ట్రగులింగ్ హీరోయిన్ అయిన రియాకు ఎక్కడిదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ ఖాతా నుంచి ఆమె పదిహేను కోట్ల రూపాయల వరకు తన అకౌంట్ లోకి బదిలీ చేసుకుందని ఆమె తండ్రి ఆరోపణ. ఆ డబ్బు ఇలా వాడుతోందా? లేక తన వెనక ఎవరైనా పెద్దల హస్తం ఉందా?
This post was last modified on July 30, 2020 12:25 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…