Movie News

అదే కథతో సినిమా చేయడానికి పిచ్చోడినా-విశ్వక్


కొన్ని నెలల కిందట స్వల్ప వ్యవధిలో ‘ధమాకా’, ‘ధమ్కీ’ సినిమాల ట్రైలర్లు రిలీజయ్యాయి. అవి చూస్తే రెండు సినిమాలకు చాలా పోలికలు కనిపించాయి. ఈ రెండు చిత్రాలకూ రచయిత ప్రసన్నకుమార్ బెజవాడనే కావడం విశేషం. మరి ఒకే రచయిత రెండు సినిమాలకు ఒకే రకమైన కథ ఇవ్వడమేంటి అనే చర్చ నడిచింది.

ఈ రెండు సినిమాల్లో ముందుగా ‘ధమాకా’ రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. ‘ధమ్కీ’ సినిమా రముందు అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదు. కథలో పోలికల వల్ల తర్వాత మార్పులు చేర్పులు చేసి.. రీషూట్లు జరిపి నెల ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలపై ‘ధమ్కీ’ హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్సేన్ స్పందించాడు.

ఒక రచయిత రెండు సినిమాలకు ఎక్కడైనా ఒకే కథ ఇస్తాడా అని విశ్వక్ ప్రశ్నించాడు. వేరే సినిమా కథతో పోలిక ఉన్న స్టోరీని తీసుకుని సినిమా చేయడానికి నేనేమైనా పిచ్చోడినా అని విశ్వక్ అన్నాడు. రెండు సినిమాలకు ఒకే కథ ఇచ్చి ప్రసన్న కుమార్ ఇండస్ట్రీలో తిరగగలడా అని విశ్వక్ ప్రశ్నించాడు. ‘ధమాకా’ సినిమాకు ‘ధమ్కీ’కి ఏ పోలికా లేదని.. ‘ధమ్కీ’లో తాను ద్విపాత్రాభినయం చేశానని విశ్వక్ తెలిపాడు. తన సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి కారణం.. రీషూట్లు కాదని, అలాంటివేమీ జరగలేదని అతను స్పష్టం చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ వల్లే రిలీజ్ లేటైందని అతను తెలిపాడు.

ఈ కథతో తాను బాగా కనెక్ట్ కావడం వల్లే స్వయంగా డైరెక్ట్ చేసినట్లు వెల్లడించాడు. తాను డైరెక్ట్ చేయాలనుకునే వేరే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మొదట ఉంటాడని.. ఆ తర్వాత బాలయ్యను సైతం డైరెక్ట్ చేయాలని ఉందని విశ్వక్ తెలిపాడు. అర్జున్‌తో వివాదం గురించి స్పందిస్తూ.. తన గురించి ఆయన ప్రెస్ మీట్ విషయంలో ఇప్పటికీ తనకు క్వశ్చన్ మార్క్ ఉందని వ్యాఖ్యానించాడు.

This post was last modified on March 21, 2023 3:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago