Movie News

రమ్యకృష్ణ వద్దన్నా వినిపించుకోని కృష్ణవంశీ


పెళ్లి తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమానే చేయలేదు రమ్యకృష్ణ. ఆమె క్యామియో రోల్ చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమా కృష్ణవంశీతో వివాహం తర్వాతే రిలీజైనప్పటికీ.. ఇది కూడా పెళ్లికి ముందు ఒప్పుకున్న సినిమానే. ఎట్టకేలకు ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగమార్తాండ’లో రమ్య కీలక పాత్ర పోషించింది. ఇందులో ఆమె పాత్ర.. తన నటన గురించి కృష్ణవంశీ చాలా గొప్పగా చెబుతున్నాడు.

ఐతే కృష్ణవంశీ ఎంతో ఇష్టపడి, కష్టపడి తీసిన ఈ సినిమాను రమ్యకృష్ణ గట్టిగా వ్యతిరేకించిందట. ‘రంగమార్తాండ’.. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే ఒరిజినల్ చూసిన తాను.. ఇలాంటి సినిమా తీస్తే ఎవరు చూస్తారు అని కృష్ణవంశీతో అన్నానని.. అయినా సరే తన భర్త మొండిగా ఈ సినిమా చేశాడని ఆమె వెల్లడించింది.

“నట సామ్రాట్ సినిమాను కృష్ణవంశీ రీమేక్ చేయబోతున్నట్లు చెప్పడంతో ఒరిజినల్ చూశా. ఇలాంటి సీరియస్ సినిమా ఎవరు చూస్తారని అడిగా. ఆయన వినిపించుకోకుండా షూట్ మొదలుపెట్టారు. ఇందులోని ఓ పాత్ర కోసం చాలామంది హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ ఎంపిక కాకపోవడంతో ‘నేను చేస్తా’ అని చెప్పాను. ఈ పాత్ర నా స్టయిల్లో ఉండదని.. కళ్లతోనే నటించాల్సి ఉంటుందని కృష్ణవంశీ చెప్పాడు. నిజానికి నాకు సీరియస్ సినిమాలు నచ్చవు. ఎమోషనల్ సినిమాలు నేను చూడను” అని రమ్యకృష్ణ తెలిపింది.

రమ్యకృష్ణ ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్‌కు జోడీగా నటించింది. ఇది ఒక రంగస్థల నటుడిగా కథతో తెరకెక్కిన చిత్రం. మరాఠీలో నానా పటాకర్ చేసిన పాత్రను ఇక్కడ ప్రకాష్ రాజ్ చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా చాలా సీరియస్‌గా సాగే పాత్రను చేశాడు. ఉగాది కానుకగా బుధవారమే ‘రంగమార్తాండ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

This post was last modified on March 21, 2023 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago