అవసరాల శ్రీనివాస్ నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. దర్శకుడిగా అంతకు మించి అభిమానం సంపాదించుకున్నాడు. మెగా ఫోన్ పట్టి అతను తీసిన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ కమర్షియల్ సక్సెస్ కావడమే కాక కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. రెండో చిత్రం ‘జ్యో అచ్యుతానంద’ కూడా రెండు రకాలుగా మంచి ఫలితాన్నందుకుంది. దీంతో దర్శకుడిగా అవసరాల మూడో సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ అతను ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నాడు.
స్క్రిప్టు రాసి సినిమాను మొదలుపెట్టడంలోనే చాలా ఆలస్యం జరగ్గా.. ఆ తర్వాత కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అయింది. ఐతే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు చూశాక.. లేటైతే అయ్యింది కానీ అవసరాల మరో క్లాసిక్తో రాబోతున్నాడనే అంచనాలు పెట్టుకున్నారు తన ఫ్యాన్స్.
కానీ తీరా బొమ్మ చూశాక అందరికీ దిమ్మదిరిగిపోయింది. కథ, పాత్రలు, సంభాషణలు సహజంగా ఉంటూ హాలీవుడ్ సినిమా ‘బిఫోర్ సన్రైజ్’ తరహా సినిమా తీద్దామని అవసరాల చేసిన ప్రయోగం దారుణంగా బెడిసికొట్టేసింది. అసలు కథంటూ ఏమీ లేకుండా.. కథనంలో ఏ విశేషం లేకుండా.. తన మార్కు చమత్కారం.. డైలాగులు లేకుండా.. ఒక నిస్సారమైన సినిమా తీసిపెట్టాడు అవసరాల. అతను ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు తయారైంది సినిమా పరిస్థితి.
సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షకుల్లో నిస్సారం ఆవహించి చివరి వరకు కూర్చోవడానికి కష్టపడాల్సి వచ్చింది. సినిమా అంతా చూసినా ఒక్క మెరుపు లేదు. అసలు సినిమా తీస్తున్నపుడు.. తర్వాత రష్ చూసుకున్నపుడు అవసరాల సహా ఎవ్వరికీ ఏ అనుమానం రాకపోవడం.. అందరూ గుడ్డిగా అవసరాలను నమ్మేసి అతను ఏం తీస్తే అది ఓకే చేసి ఫైనల్ కట్ వదిలేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి సినిమా కోసమా అవసరాల ఏడేళ్లు టైం తీసుకున్నాడంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.
This post was last modified on March 18, 2023 7:19 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…