అవసరాల శ్రీనివాస్ నటుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. దర్శకుడిగా అంతకు మించి అభిమానం సంపాదించుకున్నాడు. మెగా ఫోన్ పట్టి అతను తీసిన తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ కమర్షియల్ సక్సెస్ కావడమే కాక కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. రెండో చిత్రం ‘జ్యో అచ్యుతానంద’ కూడా రెండు రకాలుగా మంచి ఫలితాన్నందుకుంది. దీంతో దర్శకుడిగా అవసరాల మూడో సినిమా కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ అతను ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నాడు.
స్క్రిప్టు రాసి సినిమాను మొదలుపెట్టడంలోనే చాలా ఆలస్యం జరగ్గా.. ఆ తర్వాత కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అయింది. ఐతే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు చూశాక.. లేటైతే అయ్యింది కానీ అవసరాల మరో క్లాసిక్తో రాబోతున్నాడనే అంచనాలు పెట్టుకున్నారు తన ఫ్యాన్స్.
కానీ తీరా బొమ్మ చూశాక అందరికీ దిమ్మదిరిగిపోయింది. కథ, పాత్రలు, సంభాషణలు సహజంగా ఉంటూ హాలీవుడ్ సినిమా ‘బిఫోర్ సన్రైజ్’ తరహా సినిమా తీద్దామని అవసరాల చేసిన ప్రయోగం దారుణంగా బెడిసికొట్టేసింది. అసలు కథంటూ ఏమీ లేకుండా.. కథనంలో ఏ విశేషం లేకుండా.. తన మార్కు చమత్కారం.. డైలాగులు లేకుండా.. ఒక నిస్సారమైన సినిమా తీసిపెట్టాడు అవసరాల. అతను ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు తయారైంది సినిమా పరిస్థితి.
సినిమా మొదలైన కాసేపటికే ప్రేక్షకుల్లో నిస్సారం ఆవహించి చివరి వరకు కూర్చోవడానికి కష్టపడాల్సి వచ్చింది. సినిమా అంతా చూసినా ఒక్క మెరుపు లేదు. అసలు సినిమా తీస్తున్నపుడు.. తర్వాత రష్ చూసుకున్నపుడు అవసరాల సహా ఎవ్వరికీ ఏ అనుమానం రాకపోవడం.. అందరూ గుడ్డిగా అవసరాలను నమ్మేసి అతను ఏం తీస్తే అది ఓకే చేసి ఫైనల్ కట్ వదిలేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి సినిమా కోసమా అవసరాల ఏడేళ్లు టైం తీసుకున్నాడంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.
This post was last modified on March 18, 2023 7:19 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…