పెద్ద నిర్మాత అండగా ఉన్నా చిన్న సినిమాగా విడుదలై మొదటి వారం పూర్తి చేసుకున్న బలగం సెకండ్ వీక్ ప్రారంభంలోపే డబుల్ బ్రేక్ ఈవెన్ దాటేసి రెవిన్యూ పరంగా సూపర్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఏపీలో కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ తెలంగాణ జనాలు మాత్రం తమ నేటివిటీని ఇంత గొప్పగా చూపించిన సినిమాని బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. పైగా సార్ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం ఏదీ లేకపోవడంతో ఆ అంశం బలగంకి బాగా కలిసి వస్తోంది. 3 కోట్ల షేర్ కి అతి దగ్గరగా ఉన్న ఈ ఎమోషనల్ డ్రామా గ్రాస్ రూపంలో ఏడు కోట్లను ఇవాళో రేపో టచ్ చేయబోతోంది.
థియేట్రికల్ బిజినెస్ కేవలం కోటి నలభై లక్షల్లోపే చేసిన నిర్మాత దిల్ రాజుకు స్వంతంగా చేసుకున్న రిలీజ్ మంచి ఫలితాలను తెచ్చి పెడుతోంది. బయ్యర్లు సైతం లాభ పడ్డారు. ఈ శుక్రవారం వస్తున్నవాటిలో దేనిమీద కనీస అంచనాలు లేకపోవడంతో దాన్ని బలగం మరోసారి క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. నైజామ్ ఏరియాలో టికెట్ రేట్లు తగ్గించి పెట్టడం మాస్ ని లాగుతోంది. ఆంధ్రలో ఆ సౌలభ్యం లేకపోవడం ప్రభావం చూపుతోంది. మార్చి 17 దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు కనక దాన్ని బలగం ఎంతమేరకు వాడుకుంటుందో చూడాలి.
దర్శకుడు వేణు యెల్దెండ్ల కోరుకున్న దానికన్నా పెద్ద గుర్తింపు వచ్చింది. తనతోనే దిల్ రాజు ఈసారి పెద్ద బడ్జెట్ మూవీ ప్లాన్ ఉందని ఆల్రెడీ చెప్పేశారు. కేవలం ఎమోషనల్ డ్రామాలే కాకుండా కమర్షియల్ స్కేల్ లోనూ నిరూపొంచుకోవాలని వేణు ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి రాజుగారి మద్దతు దక్కడంతో ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలు జరుగుతున్నాయి. బలగం ఫలితం చూశాక మరికొన్ని ఈ తరహా జానర్లలో తీసేందుకు కొత్త దర్శకులు కథలు రాసుకుంటున్నారట. పది కోట్ల మార్క్ ని బలగం టచ్ చేయొచ్చనే అంచనాలున్నాయి కానీ అదంత సులభమైతే కాదు.
This post was last modified on March 10, 2023 10:05 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…