పెద్ద నిర్మాత అండగా ఉన్నా చిన్న సినిమాగా విడుదలై మొదటి వారం పూర్తి చేసుకున్న బలగం సెకండ్ వీక్ ప్రారంభంలోపే డబుల్ బ్రేక్ ఈవెన్ దాటేసి రెవిన్యూ పరంగా సూపర్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఏపీలో కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ తెలంగాణ జనాలు మాత్రం తమ నేటివిటీని ఇంత గొప్పగా చూపించిన సినిమాని బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. పైగా సార్ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం ఏదీ లేకపోవడంతో ఆ అంశం బలగంకి బాగా కలిసి వస్తోంది. 3 కోట్ల షేర్ కి అతి దగ్గరగా ఉన్న ఈ ఎమోషనల్ డ్రామా గ్రాస్ రూపంలో ఏడు కోట్లను ఇవాళో రేపో టచ్ చేయబోతోంది.
థియేట్రికల్ బిజినెస్ కేవలం కోటి నలభై లక్షల్లోపే చేసిన నిర్మాత దిల్ రాజుకు స్వంతంగా చేసుకున్న రిలీజ్ మంచి ఫలితాలను తెచ్చి పెడుతోంది. బయ్యర్లు సైతం లాభ పడ్డారు. ఈ శుక్రవారం వస్తున్నవాటిలో దేనిమీద కనీస అంచనాలు లేకపోవడంతో దాన్ని బలగం మరోసారి క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. నైజామ్ ఏరియాలో టికెట్ రేట్లు తగ్గించి పెట్టడం మాస్ ని లాగుతోంది. ఆంధ్రలో ఆ సౌలభ్యం లేకపోవడం ప్రభావం చూపుతోంది. మార్చి 17 దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు కనక దాన్ని బలగం ఎంతమేరకు వాడుకుంటుందో చూడాలి.
దర్శకుడు వేణు యెల్దెండ్ల కోరుకున్న దానికన్నా పెద్ద గుర్తింపు వచ్చింది. తనతోనే దిల్ రాజు ఈసారి పెద్ద బడ్జెట్ మూవీ ప్లాన్ ఉందని ఆల్రెడీ చెప్పేశారు. కేవలం ఎమోషనల్ డ్రామాలే కాకుండా కమర్షియల్ స్కేల్ లోనూ నిరూపొంచుకోవాలని వేణు ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి రాజుగారి మద్దతు దక్కడంతో ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలు జరుగుతున్నాయి. బలగం ఫలితం చూశాక మరికొన్ని ఈ తరహా జానర్లలో తీసేందుకు కొత్త దర్శకులు కథలు రాసుకుంటున్నారట. పది కోట్ల మార్క్ ని బలగం టచ్ చేయొచ్చనే అంచనాలున్నాయి కానీ అదంత సులభమైతే కాదు.
This post was last modified on March 10, 2023 10:05 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…