రాను రాను రీరిలీజుల వ్యవహారం మరీ దారుణంగా తయారవుతోంది. పాత బ్లాక్ బస్టర్లని రీ మాస్టర్ చేయించి విడుదల చేస్తేనే థియేటర్ల దగ్గర జనం కనిపించడం లేదు. అలాంటిది డిజాస్టర్లను తీసుకురావడమంటే అదో పెద్ద విచిత్రం. ఆ మధ్య ప్రభాస్ రెబెల్ ని హీరో పుట్టినరోజనే సెంటిమెంట్ తో ఫ్యాన్స్ మీద రుద్దితే ఆ ఎమోషనల్ ట్రాప్ లో పడ్డ అభిమానులు చాలా చోట్ల దాన్ని బాగానే ఆదరించి వసూళ్లు ఇచ్చారు. అలా అని అదేమీ ఇప్పటికిప్పుడు కల్ట్ క్లాసిక్ అయిపోలేదు. డార్లింగ్ కెరీర్ మొత్తంలో అత్యంత బ్యాడ్ మూవీస్ లో దాని చోటు పదిలంగానే ఉంది.
ఇప్పుడీ వరసలో జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా తీసుకొస్తున్నారు. అది కూడా ఈ మార్చి నెలలోనే. దీని మీద తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ, టెంపర్ లాంటి మంచి సినిమాలు వదిలేసి ఇలాంటి ఫ్లాపులను ఎందుకు రుద్దుతున్నారని నిలదీస్తున్నారు. తీరా రేపు కలెక్షన్లు రాకపోతే ట్విట్టర్ లో జరిగే ట్రోలింగ్ కి అనవసరమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2004లో వచ్చిన ఆంధ్రావాలా అప్పట్లో ఒక సంచలనం. ఆడియో లాంచ్ కి లక్షలాది అభిమానులను స్పెషల్ ట్రైన్లు వేసి మరీ తీసుకెళ్లడం ఒక చరిత్ర.
మళ్ళీ అది ఎవరికీ రిపీట్ కాలేదు. విపరీతమైన హైప్ తో వచ్చిన ఆంధ్రావాలా అంచనాలను కనీస స్థాయిలో అందుకోలేకపోయింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తో పాటు ప్రేక్షకులకూ పెద్ద షాక్ ఇచ్చింది. రొటీన్ స్టోరీ, అతిగా అనిపించే కామెడీ ట్రాక్, అతకని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వెరసి ఏ కోణంలోనూ కనీసం పర్వాలేదనే టాక్ తెచ్చుకోలేదు. ఒక్క చక్రి పాటలు వాటికి జూనియర్ డాన్సులు మాత్రమే అంతో ఇంతో సేవ్ చేశాయి తప్ప మిగిలినదంతా స్క్రాపని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సంబరం జరుగుతున్న టైంలో అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో
This post was last modified on March 9, 2023 11:10 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…