రెండు మూడు నెలల గ్యాపులో వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్న కిరణ్ అబ్బవరం తాజాగా మరో సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం కిరణ్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా థియేటర్స్ లో ఆడుతుంది. వచ్చే నెల ‘మీటర్’ అనే సినిమాతో మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఆ వెంటనే ‘రూల్స్ రంజన్’ సినిమా లైన్లో ఉంది. ఆ సినిమా షూటింగ్ ఫినిషింగ్ లో ఉంది. తాజాగా మరో సినిమాను లాంచ్ చేసుకున్నాడు యంగ్ హీరో.
కిరణ్ అబ్బవరం 9 గా తెరకెక్కనున్న ఈ సినిమాకు విశ్వకరున్ దర్శకుడు. డెబ్యూ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్న కిరణ్ ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు. ఇక రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో కూడా సినిమా కౌంట్ లో 15 దగ్గరే ఉంటే నిన్న మొన్న వచ్చిన కిరణ్ మాత్రం అప్పుడే 9 సినిమాల కౌంట్ కి చేరుకొని పదో సినిమా దగ్గరికి వచ్చేశాడు.
ఇలా నెలల గ్యాప్ లో కిరణ్ సినిమాలు రిలీజ్ చేస్తుండటంతో నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. వరుస సినిమాలతో ఆది సాయి కుమార్ తర్వాత నువ్వే అంటూ కిరణ్ పై కామెంట్స్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం అవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలతో కౌంట్ పెంచేసుకుంటూ వెళ్తున్నాడు కానీ క్వాలిటీ చూసుకోవడం లేదనేది ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు కంటెంట్ తో ఈ కుర్ర సూపర్ హిట్ కొట్టింది లేదు. కమర్షియల్ గా ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ , ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాలు ఫరవాలేదనిపించాయి కానీ కంటెంట్ పరంగా పూర్తి స్తాయిలో మెప్పించలేదు. మరి కుర్ర హీరో ఇకపై అయినా కౌంట్ తగ్గించి కంటెంట్ మీద దృష్టి పెడితే బాగుంటుందేమో.
This post was last modified on March 9, 2023 2:57 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…