నందమూరి తారకరత్న కన్నుమూత యావత్ నందమూరి అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తింది. వివాద రహితుడిగా సౌమ్యుడిగా పేరున్న తనకు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. నటించిన సినిమాలు కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్లకపోయినప్పటికీ నటనపరంగా ఎప్పటికప్పుడు తనను తాను ఋజువు చేసుకుంటూనే వచ్చాడు. దర్శకుడు రవిబాబు తీసిన అమరావతిలో విలన్ గా నంది అవార్డు సాధించడం దానికి నిదర్శనం. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకపక్క సెకండ్ ఇన్నింగ్స్ నడుపుతూనే రాజకీయాల్లోకి రావాలనుకున్న టైంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
తారకరత్నకు అందరికంటే బాలకృష్ణతోనే చనువు ఎక్కువ. బాలా బాబాయ్ అంటూ మురిపెంగా పిలుచుకుంటూ ఆయన సంతకాన్ని ఏకంగా పచ్చబొట్టు వేయించుకునేంత ప్రేమ చూపించేవాడు. ఇటీవలే ఓ పెళ్లి వేడుకలో ఇద్దరు కలిసి ముచ్చటించుకోవడం వీడియో రూపంలో వైరల్ అయ్యింది. అయితే ఈ బాబాయ్ అబ్బాయ్ కాంబోలో ఇప్పటిదాకా సినిమా రాలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య చేస్తున్న 107వ చిత్రంలో తారకరత్నను విలన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నారా రోహిత్ రాజా చెయ్యి వేస్తేలో మెప్పించిన అనుభవం ఎలాగూ ఉంది.
కానీ విధి తలంపు మరోలా ఉంది. బాబాయ్ తో స్క్రీన్ పంచుకోవాలన్న తన కల నెరవేరకుండానే తారకరత్న సెలవు తీసుకున్నాడు. ఇది బాలయ్యకూ తీవ్ర మనస్థాపం కలిగించేదే. ఆ మధ్య 9 అవర్స్ వెబ్ సిరీస్ లో ఇన్స్ పెక్టర్ గా వెబ్ ఓటిటిలో అడుగు పెట్టిన తనకు ఆఫర్లు కూడా పెరిగాయి. యాక్టింగ్ ప్లస్ పొలిటికల్ రెండో బాలన్స్ చేసుకుంటూ వెళదామనుకున్న టైంలో ఈ దుర్ఘటన జరిగిపోయింది. 2002 లో ఒకటో నెంబర్ కుర్రాడుతో మొదలుపెట్టి ఇప్పటిదాకా పాతిక దగ్గరగా సినిమాలు చేసిన తారకరత్న చివరి చిత్రం మిస్టర్ తారక్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
This post was last modified on February 19, 2023 11:36 am
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…
అది మార్చి.. ఎన్నికలకు 50 రోజులకు పైగానే సమయం ఉంది. సర్వేల సంస్థలు ప్రజలను కలుస్తున్నాయి. మీకు ఏ సీఎం…
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ఇన్నాళ్లూ జరిగిన ప్రచారంలో అస్సలు నిజం లేదని తేలిపోయింది.…