Movie News

బాబాయితో నటించే కల నెరవేరకుండానే

నందమూరి తారకరత్న కన్నుమూత యావత్ నందమూరి అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తింది. వివాద రహితుడిగా సౌమ్యుడిగా పేరున్న తనకు సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. నటించిన సినిమాలు కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్లకపోయినప్పటికీ నటనపరంగా ఎప్పటికప్పుడు తనను తాను ఋజువు చేసుకుంటూనే వచ్చాడు. దర్శకుడు రవిబాబు తీసిన అమరావతిలో విలన్ గా నంది అవార్డు సాధించడం దానికి నిదర్శనం. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకపక్క సెకండ్ ఇన్నింగ్స్ నడుపుతూనే రాజకీయాల్లోకి రావాలనుకున్న టైంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

తారకరత్నకు అందరికంటే బాలకృష్ణతోనే చనువు ఎక్కువ. బాలా బాబాయ్ అంటూ మురిపెంగా పిలుచుకుంటూ ఆయన సంతకాన్ని ఏకంగా పచ్చబొట్టు వేయించుకునేంత ప్రేమ చూపించేవాడు. ఇటీవలే ఓ పెళ్లి వేడుకలో ఇద్దరు కలిసి ముచ్చటించుకోవడం వీడియో రూపంలో వైరల్ అయ్యింది. అయితే ఈ బాబాయ్ అబ్బాయ్ కాంబోలో ఇప్పటిదాకా సినిమా రాలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం బాలయ్య చేస్తున్న 107వ చిత్రంలో తారకరత్నను విలన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. నారా రోహిత్ రాజా చెయ్యి వేస్తేలో మెప్పించిన అనుభవం ఎలాగూ ఉంది.

కానీ విధి తలంపు మరోలా ఉంది. బాబాయ్ తో స్క్రీన్ పంచుకోవాలన్న తన కల నెరవేరకుండానే తారకరత్న సెలవు తీసుకున్నాడు. ఇది బాలయ్యకూ తీవ్ర మనస్థాపం కలిగించేదే. ఆ మధ్య 9 అవర్స్ వెబ్ సిరీస్ లో ఇన్స్ పెక్టర్ గా వెబ్ ఓటిటిలో అడుగు పెట్టిన తనకు ఆఫర్లు కూడా పెరిగాయి. యాక్టింగ్ ప్లస్ పొలిటికల్ రెండో బాలన్స్ చేసుకుంటూ వెళదామనుకున్న టైంలో ఈ దుర్ఘటన జరిగిపోయింది. 2002 లో ఒకటో నెంబర్ కుర్రాడుతో మొదలుపెట్టి ఇప్పటిదాకా పాతిక దగ్గరగా సినిమాలు చేసిన తారకరత్న చివరి చిత్రం మిస్టర్ తారక్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

This post was last modified on February 19, 2023 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

38 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago