Political News

షర్మిల అరెస్టు.. హైదరాబాద్ కు తరలింపు

అనుకున్నట్లే జరిగింది. వైఎస్సార్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ఆమె పాదయాత్రను కూడా రద్దు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఫిబ్రవరి 18న మహబూబాబాద్ లో ఆమె నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ను పరుష పదజాలంతో దూషించారన్న ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు ఆదివారం ఉదయం షర్మిల కారవాన్ వద్దకు వెళ్లారు. ప్రస్తుతం ఆమె పాదయాత్ర మహబూబాబాద్ సమీపంలోని బేతోలు వద్ద షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేత లూనవత్ అశోక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆమెపైన ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయటం గమనార్హం.

తాను కనుసైగ చేస్తే చాలు.. తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారంటూ శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై అంతే ధీటుగా స్పందించారు షర్మిల. శంకర్ నాయక్ సైగ చేయ్.. ఎవడొస్తాడో చూస్తానంటూ సవాలు విసరటంతో పాటు.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదన్న ఆమె మాటలు మంటలు పుట్టేలా మారాయి. ఊహించని రీతిలో ఆమె నుంచి వచ్చిన ఘాటు వ్యాఖ్యలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.

అందుకే ఆమె పాదయాత్రను అడ్డుకొని.. అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా ఆమె పాదయాత్ర వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసు వాహనంలో ఎక్కించారు. ఆమెను హైదరాబాద్ కు తరలించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె చేయాల్సిన పాదయాత్రను కూడా అడ్డుకోవాలన్నదే ఆలోచనగా చెబుతున్నారు.

ఘాటు విమర్శలు చేస్తున్న షర్మిల పాదయాత్రకు సమాధానం చెప్పకుండా వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలకు సైతం మంట పుట్టేలా మాట్లాడే విషయంలో షర్మిల సక్సెస్ అవుతున్నారు. వచ్చే నెలలో ఆమె తన పాదయాత్రను ముగించాల్సి ఉంది. అయితే.. అంతవరకు వెళ్లకుండా ఆమె పాదయాత్రకు బ్రేకులు వేసేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

This post was last modified on February 19, 2023 11:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

5 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago