ఏ రాజకీయ పార్టీకైనా నాయకులు చాలా ముఖ్యం క్షేత్రస్థాయిలో కేడర్.. కీలక నేతల సహకారం.. లేకపోతే .. ఏ పార్టీ కూడా గెలుపు గుర్రం ఎక్కిన పరిస్థితి లేదు. అందుకే.. పార్టీ ఏదైనా కూడా నాయకుల విషయంలో ఒకింత ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఇది గతంలో ఉండేది. పార్టీలు నేతలపై భారం వేచి ఊరుకునేవి. తమ పని తాము చేసుకునిపోయేవి. నిర్ణయాలు తీసుకుని వదిలేయడం మినహా.. నేతలపై పెద్దగా ఒత్తిడి తెచ్చిన సందర్భాలు లేవు.
కానీ, ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా.. టీడీపీ, వైసీపీల్లో నాయకులపై అపనమ్మకం పెరుగుతోంది. ఏమో ఏం చేస్తారో.. అనే బెంగ పార్టీల అధినేతలను పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా ప్రజల్లో ఉండడం లేదేని.. ప్రజలకు అవసరమైన పనులు చేయడం లేదని.. పార్టీని పురోగతిలోకి తీసుకువెళ్లడం లేదని.. ఇలా కారణాలు ఏవైనా కూడా పార్టీల్లో నాయకులపై అపనమ్మకం పెరిగింది.
ఇది .. ఆయా పార్టీలకు మేలు చేస్తుందా? అంటే కాదనే అంటున్నారు పరిశీలకులు. నాయకులు ఆత్మ విశ్వాసంతో ఉంటేనే పార్టీలు పుంజుకుంటాయని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీని తీసుకుంటే.. తమకు ఏమాత్రం స్వేచ్ఛ లేదని నాయకులు పదే పదే చెబుతున్నారు. అయితే.. తాము చెప్పింది వినడమే తప్ప..మీరు ఏమీ మాట్లాడొద్దు అన్న విధంగా వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తోంది. ఇది.. పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు.
అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో నాయకులు కొనసాగుతున్నారు. ఇక, టీడీపీ విషయానికి వచ్చినా.. సేమ్ టు సేమ్. నేతలను సరైన దిశగా నడిపించేస్తున్నానని.. తాను చెప్పిందే వినాలని భావిస్తున్న చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో నాయకుల మనో భావాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఇటు టీడీపీపైనా నేతలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల జయమంగళ వెంకటరమణ పార్టికి దూరమయ్యారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. పార్టీలకు అపనమ్మకం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on February 18, 2023 11:11 pm
స్టార్ హీరోలు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలకు శాటిలైట్ ప్రీమియర్లు భారీ స్థాయిలో స్పందన తెచ్చుకుంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం…
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…