పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో రెండు అప్ కమింగ్ సినిమాలు ఓపెనింగ్ చేశాడు. అందులో ఒకటి హరీష్ శంకర్ తో చేయబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కాగా మరొకటి సుజీత్ డైరెక్షన్ లో నటించనున్న OG. ఈ రెండు సినిమాలు ఓపెనింగ్ చేసేసి షూటింగ్ కి మాత్రం టైమ్ తీసుకుంటున్నాడు పవన్.
ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అదే వినోదాయ సీతమ్. తమిళ్లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను తెలుగులో కూడా సముద్రఖని నే డైరెక్ట్ చేయబోతున్నాడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఈ నెలలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా, ఓపెనింగ్ లేకుండానే సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ రీమేక్ కోసం పవన్ కేవలం ఇరవై రోజుల కాల్షీట్ ఇచ్చాడు. అంటే నెలలోపే ఈ సినిమాను కంప్లీట్ చేస్తాడన్న మాట. పవన్ తో సాయి ధరమ్ తేజ నటిస్తాడు. ఫస్ట్ టైమ్ మావయ్య తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు తేజ్.
ఈ సినిమా కోసం ఇప్పటికే పవన్ వర్కవుట్స్ మొదలుపెట్టాడు. ఫిట్ గా ఉండే లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇందులో మోడ్రన్ గాడ్ గా నటించనున్నాడు. ఇందుకోసం షూటింగ్ జరిగినన్ని రోజులు మాంసాహారానికి దూరంగా ఉంటూ శాఖాహారం తీసుకునే ఆలోచనలో ఉన్నాడు.
ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. త్రివిక్రమ్ ఇప్పటికే తన వర్క్ కంప్లీట్ చేసేశాడు. మరికొందరు రైటర్స్ కూడా ఇందులో కొంత పాత్ర పోషిస్తున్నారని తెలుస్తుంది.
This post was last modified on February 13, 2023 8:02 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…