జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నా కమర్షియల్ అంశాలతో హాస్యపు డామినేషన్ స్పష్టంగా కనిపించే మూవీ అదుర్స్. అందులో బ్రాహ్మణా ఆగ్రహారంలో గురు శిష్యులుగా తారక్ బ్రహ్మానందం పేల్చిన కామెడీ మాములుగా ఉండదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో వీళ్లిద్దరి ఎక్స్ ప్రెషన్లను మీమర్లు కొన్ని లక్షలసార్లు వాడుకుని ఉంటారు. ముఖ్యంగా చంద్రకళగా నటించిన నయనతారతో ప్రేమ పెళ్లి వ్యవహారంలో బ్రహ్మి ఇచ్చే హావభావాలు దానికి పడే కౌంటర్లు ఇప్పుడు చూసినా ఫ్రెష్ గా అనిపిస్తాయి. వివి వినాయక్ మార్కు యాక్షన్ తో పాటు అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి.
ఇప్పుడీ అదుర్స్ ని మార్చి 4న కొత్త ఫోర్ కె ప్రింట్ తో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆ మధ్య బాద్షా ఇలాగే చేశారు కానీ అది ఎబోవ్ యావరేజ్ మూవీ కావడం వల్ల ఫ్యాన్స్ ఎక్కువ సీరియస్ గా తీసుకోలేదు. కానీ అదుర్స్ అలా కాదు. మంచి సూపర్ హిట్ కంటెంట్ తో పాటు జూనియర్ డబుల్ యాక్షన్ ప్రత్యేకంగా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, భారీ బడ్జెట్ లాంటి ఎన్నో హంగులతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఒక్క దశలో దీనికి సీక్వెల్ తీయాలని అనుకున్నారు కానీఫ్ ఫస్ట్ పార్ట్ ని మించే స్థాయిలో స్క్రిప్ట్ రాదేమోననే అనుమానంతో వినాయక్ డ్రాప్ అయ్యారు.
ఓ ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పారు. మార్చి 4 అదుర్స్ వస్తోంది. నిజానికి టైమింగ్ లో డిస్ట్రిబ్యూటర్లు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ వారంలో చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. మీడియం బడ్జెట్ వి రెండు మూడున్నాయి కానీ ఏ పోటీ లేని డ్రై పీరియడ్ అది. సో మళ్ళీ చారి భట్టుని తెరమీద చూడాలనుకున్న వాళ్లకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది. రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా నెలకు కనీసం రెండు మూడు రీ రిలీజులు క్రమం తప్పకుండ వస్తూనే ఉన్నాయి. ఈ 14న లవర్స్ డేకి నువ్వొస్తానంటే నేనొద్దంటానాని కొంచెం పెద్ద స్థాయిలో విడుదల చేస్తున్నారు. ప్రేమికులు క్యూ కడతారని కాబోలు
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…