ఇంతకుముందు రెండు ఫ్యామిలీల హీరోల మధ్యే ఫ్యాన్ వార్స్ నడిచేవి. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నారు.
నందమూరి ఫ్యామిలీలో బాలయ్య, ఎన్టీఆర్ అభిమానుల మధ్య గొడవలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఇక మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ ప్రత్యేకంగా తయారై మిగతా మెగా హీరోల అభిమానులతో గొడవలు పడుతున్నారు.
కొన్ని నెలల కిందట రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులు ఎంతగా దిగజారిపోయి సోషల్ మీడియాలో దారుణమైన హ్యాష్ ట్యాగ్స్ పెట్టి గొడవలు పడ్డారో తెలిసిందే. ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్ మరింత కింది స్థాయికి వెళ్లిపోయాయి. ఎప్పడూ కలిసి మెలిసి సాగే.. అందరూ ఒక్కటే అన్నట్లు ఉండే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానుల మధ్య ఇప్పుడు చిచ్చు రేగింది.
ఓవైపు బాబాయ్-అబ్బాయ్ ఎంత సన్నిహితంగా ఉంటారో.. చరణ్కు పవన్ అంటే ఎంత గౌరవమో, చరణ్ అంటే పవన్కు ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. కానీ ఇదంతా పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో పవన్, చరణ్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నారు కొన్ని రోజులుగా. దీని మీద ఇప్పుడు స్పేస్లు పెట్టి బూతులు తిట్టుకునే వరకు వెళ్లిపోయింది పరిస్థితి. ఇక్కడ రాయడానికి వీల్లేని భాషలో పరస్పరం అభిమానులు పవన్, చరణ్లను దూషిస్తుండడం గమనార్హం.
రామ్ చరణ్కు సొంత ఫ్యాన్ బేస్ లేదట, పవన్ ఫ్యాన్సే అతణ్ని మోస్తున్నారట. చరణ్ పినిమాకు బేనర్లు కట్టేది కూడా పవన్ అభిమానులేనట.. ఇదీ పవన్ ఫ్యాన్స్ వాదన.
ఇంకో వైపు చరణ్ అభిమానులేమో.. పవన్ కూడా చిరు వల్లే స్టార్ అయ్యాడని, పవన్ కంటే చరణ్ చాలా సిన్సియర్గా సినిమాలు చేస్తున్నాడని.. పవన్ కోసం ఏం చేయడానికైనా చరణ్ సిద్ధంగా ఉంటాడని వాదిస్తున్నారు.
ఈ వాదనతో పాటు బూతులు తిడుతూ హీరోలను దూషిస్తున్నారు. ఫ్యాన్ వార్స్ మరీ ఒకే కుటుంబంలో ఎంతో సన్నిహితంగా ఉండే హీరోల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి వెళ్లిపోవడం బాధాకరం.
This post was last modified on February 5, 2023 12:53 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…