జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల బాధ మామూలుగా లేదు కొంత కాలంగా. టాలీవుడ్లో మిగతా స్టార్ హీరోలంతా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ.. సగటున ఏడాదికో రిలీజ్ ఉండేలా చూసుకుంటుంటే.. తారక్ మాత్రం ఏడాదికి పైగా కెమెరా ముందుకే వెళ్లలేదు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం మూడేళ్లకు పైగా సమయం పెట్టిన తారక్.. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక కూడా కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేకపోతుండడం.. కొరటాల శివతో చేయాల్సిన సినిమా షూటింగ్ ఎంతకీ ఆరంభం కాకపోవడం వారికి ఏమాత్రం రుచించడం లేదు.
ఇదిగో అదిగో అంటున్నారే తప్ప.. కొరటాల సినిమా సెట్స్ మీదికి మాత్రం వెళ్లడం లేదు. తారక్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ అంతకంతకూ పెరిగిపోయి సోషల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.
అభిమానుల వేడి ‘ఎన్టీఆర్30’ టీంకు కూడా అర్థమైనట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్ల మాదిరి జాప్యం చేస్తూ కూర్చుంటే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని భావించి ఇక వీలైనంత త్వరగా షూట్ మొదలుపెట్డానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మార్చి రెండో వారంలో చిత్రీకరణ మొదలవుతుందని.. ఇది ఫైనల్ అని.. ఇందులో ఏ సందేహాలూ పెట్టుకోవాల్సిన పని లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి. పక్కాగా అన్నీ రెడీ చేసుకుని షూటింగ్లోకి దిగుతారని.. వీలైనంత వేగంగా సినిమాను పూర్తి చేస్తారని సమాచారం.
సినిమాలో తన పాత్ర కోసం తారక్ ఇక ప్రిపరేషన్ మొదలుపెట్టనున్నాడట. నెల రోజుల్లో అతను మంచి షేప్, కొత్త లుక్లోకి మారనున్నాడట. ఇప్పటిదాకా జరిగిన నష్టాన్ని కవర్ చేసేలా ప్రశాంత్ నీల్ సినిమాను కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని.. సెప్టెంబరులో ‘సలార్’ రిలీజ్ అవ్వగానే తారక్ సినిమా ట్షూ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ అప్డేట్స్ తారక్ ఫ్యాన్స్కు ఊరటనిచ్చేవే.
This post was last modified on February 4, 2023 4:55 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…