జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల బాధ మామూలుగా లేదు కొంత కాలంగా. టాలీవుడ్లో మిగతా స్టార్ హీరోలంతా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ.. సగటున ఏడాదికో రిలీజ్ ఉండేలా చూసుకుంటుంటే.. తారక్ మాత్రం ఏడాదికి పైగా కెమెరా ముందుకే వెళ్లలేదు. ‘ఆర్ఆర్ఆర్’ కోసం మూడేళ్లకు పైగా సమయం పెట్టిన తారక్.. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక కూడా కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేకపోతుండడం.. కొరటాల శివతో చేయాల్సిన సినిమా షూటింగ్ ఎంతకీ ఆరంభం కాకపోవడం వారికి ఏమాత్రం రుచించడం లేదు.
ఇదిగో అదిగో అంటున్నారే తప్ప.. కొరటాల సినిమా సెట్స్ మీదికి మాత్రం వెళ్లడం లేదు. తారక్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్ అంతకంతకూ పెరిగిపోయి సోషల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.
అభిమానుల వేడి ‘ఎన్టీఆర్30’ టీంకు కూడా అర్థమైనట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్ల మాదిరి జాప్యం చేస్తూ కూర్చుంటే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని భావించి ఇక వీలైనంత త్వరగా షూట్ మొదలుపెట్డానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మార్చి రెండో వారంలో చిత్రీకరణ మొదలవుతుందని.. ఇది ఫైనల్ అని.. ఇందులో ఏ సందేహాలూ పెట్టుకోవాల్సిన పని లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి. పక్కాగా అన్నీ రెడీ చేసుకుని షూటింగ్లోకి దిగుతారని.. వీలైనంత వేగంగా సినిమాను పూర్తి చేస్తారని సమాచారం.
సినిమాలో తన పాత్ర కోసం తారక్ ఇక ప్రిపరేషన్ మొదలుపెట్టనున్నాడట. నెల రోజుల్లో అతను మంచి షేప్, కొత్త లుక్లోకి మారనున్నాడట. ఇప్పటిదాకా జరిగిన నష్టాన్ని కవర్ చేసేలా ప్రశాంత్ నీల్ సినిమాను కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని.. సెప్టెంబరులో ‘సలార్’ రిలీజ్ అవ్వగానే తారక్ సినిమా ట్షూ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ అప్డేట్స్ తారక్ ఫ్యాన్స్కు ఊరటనిచ్చేవే.
This post was last modified on February 4, 2023 4:55 pm
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…