పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. పవన్ తో జల్సా నుండి త్రివిక్రమ్ ఫ్రెండ్ షిప్ మొదలైంది. ఆ సినిమా తర్వాత ఇద్దరు ‘అత్తరింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు చేశారు. తీన్ మార్ , భీమ్లా నాయక్ కి త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు. తను దర్శకుడిగా మారాక మరొకరి సినిమాకి స్క్రీన్ ప్లే , మాటలు రాయడం ఒక్క పవన్ విషయంలోనే జరిగింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు రావాల్సింది. మహేష్ కంటే ముందు త్రివిక్రమ్ అతడు కథను పవన్ కే చెప్పాడు.
అతడు కథ చెప్తుంటే పవన్ పడుకున్నారంటూ త్రివిక్రమ్ పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. అయితే పవన్ మాత్రం దానిపై ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఈ విషయం గురించి బాలయ్య వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తూ పవన్ మాట్లాడాడు. త్రివిక్రమ్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఫామౌజ్ లో ఏదో పనులు చేస్తూ ఉన్నానంటూ చెప్పుకున్నాడు.
అయితే అతడు కథ చెప్పినప్పుడు పడుకున్నానని త్రివిక్రమ్ ఇప్పటికీ అంటుంటాడని , లేదు పడుకోలేదని నేను వాదిస్తానని పవన్ ఈ సందర్భంగా చెప్పాడు. అయితే ఇప్పటికీ ఆ గొడవ తేలలేదని త్రివిక్రమ్ దాన్ని వదలకుండా అప్పుడప్పుడూ గుర్తుచేస్తుంటాడని పవన్ అన్నాడు. ఇక బాలయ్య పవన్ కి సంబంధించి ఓ ఫోటో చూపించి ఫోన్లో ఎవరు త్రివిక్రమ్ ఆ? అని అడగ్గా పవన్ ఆయనే అయ్యి ఉంటాడు నాకు గుర్తులేదు అంటూ తెలిపాడు. ఏదేమైనా అతడు కథ విన్నప్పుడు పవన్ నిజంగానే పడుకున్నాడా ? లేదా ? అనేది మాత్రం ఇంకా వారిద్దరి మధ్య టాపిక్ లా ఉండి పోయిందన్నమాట.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…