పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. పవన్ తో జల్సా నుండి త్రివిక్రమ్ ఫ్రెండ్ షిప్ మొదలైంది. ఆ సినిమా తర్వాత ఇద్దరు ‘అత్తరింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు చేశారు. తీన్ మార్ , భీమ్లా నాయక్ కి త్రివిక్రమ్ రచయితగా పనిచేశాడు. తను దర్శకుడిగా మారాక మరొకరి సినిమాకి స్క్రీన్ ప్లే , మాటలు రాయడం ఒక్క పవన్ విషయంలోనే జరిగింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు రావాల్సింది. మహేష్ కంటే ముందు త్రివిక్రమ్ అతడు కథను పవన్ కే చెప్పాడు.
అతడు కథ చెప్తుంటే పవన్ పడుకున్నారంటూ త్రివిక్రమ్ పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు. అయితే పవన్ మాత్రం దానిపై ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఈ విషయం గురించి బాలయ్య వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తూ పవన్ మాట్లాడాడు. త్రివిక్రమ్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఫామౌజ్ లో ఏదో పనులు చేస్తూ ఉన్నానంటూ చెప్పుకున్నాడు.
అయితే అతడు కథ చెప్పినప్పుడు పడుకున్నానని త్రివిక్రమ్ ఇప్పటికీ అంటుంటాడని , లేదు పడుకోలేదని నేను వాదిస్తానని పవన్ ఈ సందర్భంగా చెప్పాడు. అయితే ఇప్పటికీ ఆ గొడవ తేలలేదని త్రివిక్రమ్ దాన్ని వదలకుండా అప్పుడప్పుడూ గుర్తుచేస్తుంటాడని పవన్ అన్నాడు. ఇక బాలయ్య పవన్ కి సంబంధించి ఓ ఫోటో చూపించి ఫోన్లో ఎవరు త్రివిక్రమ్ ఆ? అని అడగ్గా పవన్ ఆయనే అయ్యి ఉంటాడు నాకు గుర్తులేదు అంటూ తెలిపాడు. ఏదేమైనా అతడు కథ విన్నప్పుడు పవన్ నిజంగానే పడుకున్నాడా ? లేదా ? అనేది మాత్రం ఇంకా వారిద్దరి మధ్య టాపిక్ లా ఉండి పోయిందన్నమాట.
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…