అక్కినేని అభిమానులు ఎదురుచూసే కొద్దీ ఏజెంట్ విడుదల ఎంతకీ తెమలడం లేదు. భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కనక క్లిక్ అయితే తమ హీరోలు మాస్ లో కోల్పోయిన పట్టుని తిరిగి సాధించుకోవచ్చనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. క్లైమాక్స్ కోసమే ఎక్కువ టైం తీసుకుంటున్న దర్శకుడు సురేందర్ రెడ్డి దాన్ని రెండు వెర్షన్లుగా తీస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఫైనల్ గా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఏది బెటర్ అనిపిస్తే దానికి ఫిక్స్ అయ్యేలా నిర్ణయం తీసుకున్నారట. ఈ లెక్కన ఏప్రిల్ లో రిలీజ్ కావడం మీద అనుమానాలు ఇంకా తొలగిపోలేదు.
ఇదిలా ఉండగా శాండల్ వుడ్ నుంచి కెజిఎఫ్, కాంతార లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో సత్తా చాటిన హోంబాలే ఫిలింస్ త్వరలో అఖిల్ తోనూ ఒక క్రేజీ మూవీని ప్లాన్ చేసిందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ గా చెప్పకపోయినా ప్రాధమికంగా చర్చలు జరిగాయని, దర్శకుడిని ఫైనల్ చేశాక ప్రకటన ఇస్తారని సమాచారం. రాబోయే రోజుల్లో మూడు వేల కోట్లతో సినిమాలు ప్లాన్ చేసుకున్న అలాంటి బ్యానర్ తో అఖిల్ జట్టు కడితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ రేంజ్ ని ఆశించవచ్చు. అయితే డైరెక్టర్ ఎవరన్నది కీలకం. పైకి చూస్తేనేమో అగ్ర దర్శకులందరూ బిజీగా ఉన్నారు. హోంబాలే మనసులో ఎవరున్నారో.
మొత్తానికి అఖిల్ స్కెచ్చులు చూసేందుకు బాగున్నాయి కానీ వీటికి స్పీడ్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవైపు తన రేంజ్ హీరోలు దూసుకుపోతున్నారు. అన్నయ్య నాగ చైతన్య ఒక పరిధి దాటి మాస్ ని ఎక్కువ ఆకట్టుకోలేక కొత్త ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. అలాంటప్పుడు కమర్షియల్ మార్కెట్ మీద పట్టు సాధించాలంటే అఖిల్ ఫోకస్ పెంచాలి. నాగార్జున సైతం బంగార్రాజు తప్ప వైల్డ్ డాగ్, ది ఘోస్ట్, బిగ్ బాస్ సీజన్ 6 ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఏదున్నా మూడో తరంలో చివరి వారసుడిగా అఖిల్ మీదే బరువెక్కువ ఉంది. దాన్ని మోయడం పెద్ద సవాలే.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…