బాక్సాఫీస్ వద్ద వాల్తేరు వీరయ్య దూకుడు మాములుగా లేదు. సంక్రాంతి రేస్ లో వీరసింహారెడ్డి కన్నా ఒక రోజు ఆలస్యంగా రావడం పట్ల మెగా ఫ్యాన్స్ ముందు నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చినప్పటికీ దాన్ని పటాపంచలు చేస్తూ అన్ని సెంటర్లలో దూసుకుపోతోంది. కేవలం మూడు రోజులకు 100 కోట్ల గ్రాస్ ని దాటేసి సరికొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. యుఎస్ లో 1.7 మిలియన్ డాలర్ల మార్కుని ఓవర్ టేక్ చేసి అక్కడా సంచలనాలు నమోదు చేస్తోంది. వారం పూర్తయ్యేలోగా సులభంగా టూ మిలియన్ మైలు రాయిని అందుకోవడం చాలా సులభంగా కనిపిస్తోంది. బుకింగ్స్ స్టడీగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అనూహ్యంగా థియేటర్ల కౌంట్ పెంచాల్సి రావడం, బిసి కేంద్రాల్లో ఆడియన్స్ డిమాండ్ మేరకు అదనపు షోలను ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ వీరయ్య వీరంగానికి సూచికగానే చెప్పుకోవాలి. పండగ సీజన్ కావడంతో సాధారణంగా ఉండే జోరు కన్నా రెండుమూడింతలు ఎక్కువగానే కనిపిస్తోంది.వీరసింహారెడ్డికి సైతం మంచి ఫిగర్లు నమోదవుతున్నా చిరు డామినేషన్ తో పోలిస్తే అవి తక్కువ కావడంతో హైలైట్ కావడం లేదు. అరవై కోట్లకు పైగా షేర్ తో వీకెండ్ ని ఘనంగా ముగించిన వాల్తేరు వీరయ్య ఫిగర్లను పోస్టర్ల రూపంలో అఫీషియల్ చేయమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా మైత్రి నుంచి స్పందన లేదు.
టాలీవుడ్ కు సంక్రాంతి ఎంత కీలకమో మరోసారి స్పష్టంగా ఋజువవుతోంది. యావరేజ్ ఉన్నా పర్లేదు అన్నా స్టార్ హీరోలతో సరైన కమర్షియల్ సినిమాను కనక ఇవ్వగలిగితే వసూళ్ల సునామి ఖాయమని మరోసారి క్లారిటీ వచ్చింది. గతంలోనూ సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు లాంటి చిత్రాల టాక్ ఆటుఇటు ఊగినా సరే స్టార్ పవర్ సహాయంతో నిర్మాతకు లాభాలు తెచ్చాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలు సైతం అదే సీన్ రిపీట్ చేస్తున్నాయి. ఇవాళ రేపు పండగ సెలవుల హడావిడి ముగిసిపోతుంది కాబట్టి అసలైన పరీక్ష తిరిగి బుధవారం నుంచి మొదలుకానుంది.
This post was last modified on January 17, 2023 8:21 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…