Movie News

చిరు, బాలయ్యలకు షాకిస్తాడా?

ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఇప్పటికే మూడు సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఏదీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయింది. తమిళ అనువాద చిత్రం ‘తెగింపు’ ఏమాత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక 12, 13 తారీఖుల్లో రిలీజైన భారీ చిత్రాలు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల టాక్ కూడా ఏమంత గొప్పగా లేదు.

ఈ రెండు చిత్రాలూ బాలయ్య, చిరుల అభిమానులకు బాగానే అనిపిస్తున్నా.. సగటు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి. కేవలం హీరో క్యారెక్టర్ల ఎలివేషన్ మీదే దృష్టిపెట్టిన దర్శకులు కథాకథనాలను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐతే టాక్ ఈ సినిమాల వసూళ్ల మీద పెద్దగా ప్రభావం చూపుతున్నట్లు లేదు.

ఆ సంగతి అలా ఉంచితే పూర్తి సంతృప్తినిచ్చే ఒక్క సినిమా కూడా ఈ సంక్రాంతి ముగిసిపోతుందేమో అన్న ఆందోళన సగటు ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ఐతే శనివారం ప్రేక్షకుల ముందుకు ఇంకో రెండు చిత్రాలు వస్తున్నాయి.

అందులో ఒకటి.. అనువాద చిత్రం ‘వారసుడు’. కానీ ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆశల్లేవు. తమిళంలోనే ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది ఈ విజయ్ సినిమా. ఇక మన తెలుగు సినిమాలనే కలగలిపి తీసినట్లుగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని మన ఆడియన్స్ పట్టించుకుంటారా అన్నది సందేహమే.

ఇక సంక్రాంతికి చివరి ఆశ అంటే.. ‘కళ్యాణం కమనీయం’యే. కథ పరంగా కొంచెం కొత్తదనం ఉండి.. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించింది దీని ట్రైలర్. యూత్ కూడా రిలేటయ్యే కాన్సెప్ట్‌తోనే ఈ సినిమా తెరకెక్కింది.

సంక్రాంతికి భారీ చిత్రాలు రేసులో ఉన్నప్పటికీ యువి క్రియేషన్స్ వాళ్లు కాన్ఫిడెంట్‌గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ.. టాక్ బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమా వైపు ఆకర్షితులు కావచ్చు. మరి ఎవ్వరూ ఊహించని విధంగా కంటెంట్‌ పరంగా ఈ సంక్రాంతి విజేత ‘కళ్యాణం కమనీయం’యే అవుతుందేమో చూడాలి.

This post was last modified on January 14, 2023 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago