రౌడీ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న VD12 కి ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఖుషి’ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ కాంబో సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగవంశీ నిర్మించబోతున్నాడు. ఇటీవలే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు గౌతం. జెర్సీ హిందీ తర్వాత రామ్ చరణ్ తో గౌతం సినిమా ఎనౌన్స్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో వెంటనే విజయ్ ను అప్రోచ్ అయ్యాడు గౌతం. మార్చి లేదా ఏప్రిల్ నుండి షూటింగ్ ఈ కాంబో సినిమా షూట్ మొదలు కానుంది. ఈ లోపు విజయ్ ‘ఖుషి’ సినిమా ఫినిష్ చేయాల్సి ఉంది. సమంత డేట్స్ కారణంగా వాయిదా పడిన ఖుషి ఘాట్ త్వరలోనే మొదలు కానుంది.
అయితే రామ్ చరణ్ కి చెప్పిన కథతోనే విజయ్ సినిమా ఉంటుందా? లేదా గౌతం రౌడీ కోసం ఇంకో కథ రెడీ చేశాడా ? తెలియాల్సి ఉంది. ఈ కినేమకు సంబందించి మరిన్ని డీటైల్స్ త్వరలో రాబోతున్నాయి. లైగర్ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన విజయ్ ఖుషి , గౌతం తిన్ననూరి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ డెలివరీ చేయాలని భావిస్తున్నాడు. మరి ఈ సినిమాలు విజయ్ కి ఎలాంటి విజయం అందిస్తాయో చూడాలి.
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…