రౌడీ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న VD12 కి ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఖుషి’ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ కాంబో సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగవంశీ నిర్మించబోతున్నాడు. ఇటీవలే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు గౌతం. జెర్సీ హిందీ తర్వాత రామ్ చరణ్ తో గౌతం సినిమా ఎనౌన్స్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో వెంటనే విజయ్ ను అప్రోచ్ అయ్యాడు గౌతం. మార్చి లేదా ఏప్రిల్ నుండి షూటింగ్ ఈ కాంబో సినిమా షూట్ మొదలు కానుంది. ఈ లోపు విజయ్ ‘ఖుషి’ సినిమా ఫినిష్ చేయాల్సి ఉంది. సమంత డేట్స్ కారణంగా వాయిదా పడిన ఖుషి ఘాట్ త్వరలోనే మొదలు కానుంది.
అయితే రామ్ చరణ్ కి చెప్పిన కథతోనే విజయ్ సినిమా ఉంటుందా? లేదా గౌతం రౌడీ కోసం ఇంకో కథ రెడీ చేశాడా ? తెలియాల్సి ఉంది. ఈ కినేమకు సంబందించి మరిన్ని డీటైల్స్ త్వరలో రాబోతున్నాయి. లైగర్ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన విజయ్ ఖుషి , గౌతం తిన్ననూరి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ డెలివరీ చేయాలని భావిస్తున్నాడు. మరి ఈ సినిమాలు విజయ్ కి ఎలాంటి విజయం అందిస్తాయో చూడాలి.
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.. తాను జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)…