రౌడీ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న VD12 కి ముహూర్తం కుదిరింది. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ‘ఖుషి’ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ కాంబో సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగవంశీ నిర్మించబోతున్నాడు. ఇటీవలే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశాడు గౌతం. జెర్సీ హిందీ తర్వాత రామ్ చరణ్ తో గౌతం సినిమా ఎనౌన్స్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో వెంటనే విజయ్ ను అప్రోచ్ అయ్యాడు గౌతం. మార్చి లేదా ఏప్రిల్ నుండి షూటింగ్ ఈ కాంబో సినిమా షూట్ మొదలు కానుంది. ఈ లోపు విజయ్ ‘ఖుషి’ సినిమా ఫినిష్ చేయాల్సి ఉంది. సమంత డేట్స్ కారణంగా వాయిదా పడిన ఖుషి ఘాట్ త్వరలోనే మొదలు కానుంది.
అయితే రామ్ చరణ్ కి చెప్పిన కథతోనే విజయ్ సినిమా ఉంటుందా? లేదా గౌతం రౌడీ కోసం ఇంకో కథ రెడీ చేశాడా ? తెలియాల్సి ఉంది. ఈ కినేమకు సంబందించి మరిన్ని డీటైల్స్ త్వరలో రాబోతున్నాయి. లైగర్ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన విజయ్ ఖుషి , గౌతం తిన్ననూరి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ డెలివరీ చేయాలని భావిస్తున్నాడు. మరి ఈ సినిమాలు విజయ్ కి ఎలాంటి విజయం అందిస్తాయో చూడాలి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…