నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు తిరిగి పీక్స్ను అందుకుని చెప్పొచ్చు. యన్.టి.ఆర్-1, 2.. రూలర్ సినిమాలతో బాగా డౌన్ అయినట్లు కనిపించిన ఆయన కెరీర్ ‘అఖండ’తో అనూహ్యంగా పుంజుకుంది. అన్ స్టాపబుల్ టాక్ షో కూడా బాలయ్య క్రేజ్, ఇమేజ్ పెరగడానికి కారణమైంది. ఇలాంటి టైంలో ‘క్రాక్’ లాంటి బ్లాక్ బస్టర్ను అందించిన గోపీచంద్ మలినేనితో జట్టు కట్టడం.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం.. సంక్రాంతికి మంచి డేట్లో సినిమా రిలీజ్ కావడం.. అన్నీ ప్లస్సయ్యాయి బాలయ్యకు.
ఈ నందమూరి హీరో కెరీర్లోనే అత్యధిక లొకేషన్లు, స్క్రీన్లు, షోలతో రిలీజైన సినిమా ‘వీరసింహారెడ్డి’నే. తెలుగు రాష్ట్రాల్లో అయితే మెజారిటీ స్క్రీన్లను బాలయ్యకు ఇచ్చేశారు. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ గురువారం ఈ సినిమానే ప్రదర్శించారు. సినిమాకు హైప్ కూడా బాగా ఉండడం వల్ల ఈ అడ్వాంటేజీని బాగా ఉపయోగించుకుంది.
‘వీరసింహారెడ్డి’కి తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా సరే.. అది వసూళ్ల మీద ఏమంత ప్రభావం చూపించినట్లు కనిపించడం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అలాగే బెంగళూరు లాంటి ఇండియన్ సిటీస్లో, యుఎస్లో హౌస్ ఫుల్స్తో రన్ అయింది ఈ సినిమా. థియేటర్ల ముందు ఎటు చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపించాయి. ఈవెనింగ్, నైట్ షోలు మంచి ఆక్యుపెన్సీతో నడిచాయి. బాలయ్య కెరీర్లో అతి పెద్ద రిలీజ్ కావడం, ఫుల్ హౌస్లతో నడవడం వల్ల తొలి రోజు భారీ వసూళ్లు గ్యారెంటీ అన్నది పక్కా. బాలయ్య బాక్సాఫీస్ స్టామినాను మించి ఈ సినిమా తొలి రోజు పెర్ఫామ్ చేయబోతోందన్నది స్పష్టం.
మరీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలవకపోవచ్చు కానీ.. బాలయ్య వరకు కెరీర్ బెస్ట్ డే-1 వసూళ్లు కేక్ వాక్ అన్నది పక్కా. అఖండ సహా బాలయ్య సినిమాల తొలి రోజు వసూళ్లను పెద్ద మార్జిన్తో ‘వీరసింహారెడ్డి’ కొట్టబోతోంది. చిరు సినిమా ‘వాల్తేరు వీరయ్య’ టాక్ను బట్టి ‘వీరసింహారెడ్డి’ ఓవరాల్ రిజల్ట్ ఆధారపడి ఉండనుంది.
This post was last modified on January 13, 2023 9:02 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…