నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు తిరిగి పీక్స్ను అందుకుని చెప్పొచ్చు. యన్.టి.ఆర్-1, 2.. రూలర్ సినిమాలతో బాగా డౌన్ అయినట్లు కనిపించిన ఆయన కెరీర్ ‘అఖండ’తో అనూహ్యంగా పుంజుకుంది. అన్ స్టాపబుల్ టాక్ షో కూడా బాలయ్య క్రేజ్, ఇమేజ్ పెరగడానికి కారణమైంది. ఇలాంటి టైంలో ‘క్రాక్’ లాంటి బ్లాక్ బస్టర్ను అందించిన గోపీచంద్ మలినేనితో జట్టు కట్టడం.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడం.. సంక్రాంతికి మంచి డేట్లో సినిమా రిలీజ్ కావడం.. అన్నీ ప్లస్సయ్యాయి బాలయ్యకు.
ఈ నందమూరి హీరో కెరీర్లోనే అత్యధిక లొకేషన్లు, స్క్రీన్లు, షోలతో రిలీజైన సినిమా ‘వీరసింహారెడ్డి’నే. తెలుగు రాష్ట్రాల్లో అయితే మెజారిటీ స్క్రీన్లను బాలయ్యకు ఇచ్చేశారు. అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ గురువారం ఈ సినిమానే ప్రదర్శించారు. సినిమాకు హైప్ కూడా బాగా ఉండడం వల్ల ఈ అడ్వాంటేజీని బాగా ఉపయోగించుకుంది.
‘వీరసింహారెడ్డి’కి తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా సరే.. అది వసూళ్ల మీద ఏమంత ప్రభావం చూపించినట్లు కనిపించడం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అలాగే బెంగళూరు లాంటి ఇండియన్ సిటీస్లో, యుఎస్లో హౌస్ ఫుల్స్తో రన్ అయింది ఈ సినిమా. థియేటర్ల ముందు ఎటు చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపించాయి. ఈవెనింగ్, నైట్ షోలు మంచి ఆక్యుపెన్సీతో నడిచాయి. బాలయ్య కెరీర్లో అతి పెద్ద రిలీజ్ కావడం, ఫుల్ హౌస్లతో నడవడం వల్ల తొలి రోజు భారీ వసూళ్లు గ్యారెంటీ అన్నది పక్కా. బాలయ్య బాక్సాఫీస్ స్టామినాను మించి ఈ సినిమా తొలి రోజు పెర్ఫామ్ చేయబోతోందన్నది స్పష్టం.
మరీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలవకపోవచ్చు కానీ.. బాలయ్య వరకు కెరీర్ బెస్ట్ డే-1 వసూళ్లు కేక్ వాక్ అన్నది పక్కా. అఖండ సహా బాలయ్య సినిమాల తొలి రోజు వసూళ్లను పెద్ద మార్జిన్తో ‘వీరసింహారెడ్డి’ కొట్టబోతోంది. చిరు సినిమా ‘వాల్తేరు వీరయ్య’ టాక్ను బట్టి ‘వీరసింహారెడ్డి’ ఓవరాల్ రిజల్ట్ ఆధారపడి ఉండనుంది.
This post was last modified on January 13, 2023 9:02 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…