మెగాస్టార్ చిరంజీవికి బయట ఉన్న కోట్ల మంది అభిమానులకు తోడు.. సినీ పరిశ్రమలో కూడా పెద్ద సంఖ్యలోనే వీరాభిమానులు ఉన్నారు. అందులో ఇద్దరు ‘వాల్తేరు వీరయ్య’లో ఆయనతో కలిసి పని చేశారు. ఒకరు దర్శకుడు బాబీ అయితే.. ఇంకొకరు మాస్ రాజా రవితేజ. తాను చిరంజీవి అభిమానిని అని రవితేజ గతంలో పలుమార్లు చెప్పాడు. ‘అన్నయ్య’ సినిమాలో చిరు తమ్ముడిగా నటించినందుకు రవితేజ అప్పట్లో ఎంత ఎగ్జైట్ అయ్యాడో? ఆ తర్వాత హీరోగా పెద్ద రేంజికి వెళ్లినా సరే.. ‘వాల్తేరు వీరయ్య’లో చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు అంతే ఎగ్జైట్ అవుతున్నాడు.
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో రవితేజ.. చిరు మీద తనకు చిన్నప్పట్నుంచీ ఉన్న అభిమానం గురించి మాట్లాడాడు. చిరంజీవి మీద తన అభిమానానికి విజయవాడ నాంది పలికిందని రవితేజ ఈ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు.
విజయవాడలో చిరంజీవి సినిమా ‘విజేత’ వంద రోజుల ఫంక్షన్ జరిగిందని.. పీడబ్ల్యూ మైదానంలో ఆ వేడుక చేశారని రవితేజ గుర్తు చేసుకున్నాడు. ఐతే మెగాస్టార్ను చూడడానికి వేలమంది అభిమానులు వచ్చారని.. దీంతో తాను చాలా దూరంగా ఉండిపోయానని.. చిరును దగ్గరగా కూడా చూడలేకపోయానని రవితేజ తెలిపాడు.
ఐతే అందుకు తానేమీ ఫీల్ కాలేదని.. ఏదో ఒక రోజు వెళ్లి చిరు పక్కన కూర్చుంటా అని తన స్నేహితుల దగ్గర చాలా ధీమాగా ఛాలెంజ్ చేశానని రవితేజ చెప్పాడు. ఆపై తాను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి హీరో ఫ్రెండుగా చిన్న చిన్న వేషాలు వేసి.. ‘అన్నయ్య’ సినిమాలో చిరుకు సోదరుడిగా నటించే గొప్ప అవకాశం అందుకున్నానని.. మళ్లీ ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’లో ఆయనతో కలిసి నటించే వరకు తన ప్రస్థానం సాగిందని చెప్పాడు. ఒకప్పుడు చిరు పక్కన కూర్చుంటానని తాను తన స్నేహితులతో అన్నానని.. కానీ ఆయన సంకనెక్కి కూర్చునే స్థాయిలో క్లోజ్ అయ్యానని.. అది తన అదృష్టమని రవితేజ చమత్కరించగా.. చిరు సహా అందరూ గొల్లున నవ్వేశారు.
This post was last modified on January 9, 2023 9:28 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…