మెగాస్టార్ చిరంజీవికి బయట ఉన్న కోట్ల మంది అభిమానులకు తోడు.. సినీ పరిశ్రమలో కూడా పెద్ద సంఖ్యలోనే వీరాభిమానులు ఉన్నారు. అందులో ఇద్దరు ‘వాల్తేరు వీరయ్య’లో ఆయనతో కలిసి పని చేశారు. ఒకరు దర్శకుడు బాబీ అయితే.. ఇంకొకరు మాస్ రాజా రవితేజ. తాను చిరంజీవి అభిమానిని అని రవితేజ గతంలో పలుమార్లు చెప్పాడు. ‘అన్నయ్య’ సినిమాలో చిరు తమ్ముడిగా నటించినందుకు రవితేజ అప్పట్లో ఎంత ఎగ్జైట్ అయ్యాడో? ఆ తర్వాత హీరోగా పెద్ద రేంజికి వెళ్లినా సరే.. ‘వాల్తేరు వీరయ్య’లో చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు అంతే ఎగ్జైట్ అవుతున్నాడు.
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో రవితేజ.. చిరు మీద తనకు చిన్నప్పట్నుంచీ ఉన్న అభిమానం గురించి మాట్లాడాడు. చిరంజీవి మీద తన అభిమానానికి విజయవాడ నాంది పలికిందని రవితేజ ఈ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు.
విజయవాడలో చిరంజీవి సినిమా ‘విజేత’ వంద రోజుల ఫంక్షన్ జరిగిందని.. పీడబ్ల్యూ మైదానంలో ఆ వేడుక చేశారని రవితేజ గుర్తు చేసుకున్నాడు. ఐతే మెగాస్టార్ను చూడడానికి వేలమంది అభిమానులు వచ్చారని.. దీంతో తాను చాలా దూరంగా ఉండిపోయానని.. చిరును దగ్గరగా కూడా చూడలేకపోయానని రవితేజ తెలిపాడు.
ఐతే అందుకు తానేమీ ఫీల్ కాలేదని.. ఏదో ఒక రోజు వెళ్లి చిరు పక్కన కూర్చుంటా అని తన స్నేహితుల దగ్గర చాలా ధీమాగా ఛాలెంజ్ చేశానని రవితేజ చెప్పాడు. ఆపై తాను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి హీరో ఫ్రెండుగా చిన్న చిన్న వేషాలు వేసి.. ‘అన్నయ్య’ సినిమాలో చిరుకు సోదరుడిగా నటించే గొప్ప అవకాశం అందుకున్నానని.. మళ్లీ ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’లో ఆయనతో కలిసి నటించే వరకు తన ప్రస్థానం సాగిందని చెప్పాడు. ఒకప్పుడు చిరు పక్కన కూర్చుంటానని తాను తన స్నేహితులతో అన్నానని.. కానీ ఆయన సంకనెక్కి కూర్చునే స్థాయిలో క్లోజ్ అయ్యానని.. అది తన అదృష్టమని రవితేజ చమత్కరించగా.. చిరు సహా అందరూ గొల్లున నవ్వేశారు.
This post was last modified on January 9, 2023 9:28 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…