మెగాస్టార్ చిరంజీవికి బయట ఉన్న కోట్ల మంది అభిమానులకు తోడు.. సినీ పరిశ్రమలో కూడా పెద్ద సంఖ్యలోనే వీరాభిమానులు ఉన్నారు. అందులో ఇద్దరు ‘వాల్తేరు వీరయ్య’లో ఆయనతో కలిసి పని చేశారు. ఒకరు దర్శకుడు బాబీ అయితే.. ఇంకొకరు మాస్ రాజా రవితేజ. తాను చిరంజీవి అభిమానిని అని రవితేజ గతంలో పలుమార్లు చెప్పాడు. ‘అన్నయ్య’ సినిమాలో చిరు తమ్ముడిగా నటించినందుకు రవితేజ అప్పట్లో ఎంత ఎగ్జైట్ అయ్యాడో? ఆ తర్వాత హీరోగా పెద్ద రేంజికి వెళ్లినా సరే.. ‘వాల్తేరు వీరయ్య’లో చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు అంతే ఎగ్జైట్ అవుతున్నాడు.
ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో రవితేజ.. చిరు మీద తనకు చిన్నప్పట్నుంచీ ఉన్న అభిమానం గురించి మాట్లాడాడు. చిరంజీవి మీద తన అభిమానానికి విజయవాడ నాంది పలికిందని రవితేజ ఈ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు.
విజయవాడలో చిరంజీవి సినిమా ‘విజేత’ వంద రోజుల ఫంక్షన్ జరిగిందని.. పీడబ్ల్యూ మైదానంలో ఆ వేడుక చేశారని రవితేజ గుర్తు చేసుకున్నాడు. ఐతే మెగాస్టార్ను చూడడానికి వేలమంది అభిమానులు వచ్చారని.. దీంతో తాను చాలా దూరంగా ఉండిపోయానని.. చిరును దగ్గరగా కూడా చూడలేకపోయానని రవితేజ తెలిపాడు.
ఐతే అందుకు తానేమీ ఫీల్ కాలేదని.. ఏదో ఒక రోజు వెళ్లి చిరు పక్కన కూర్చుంటా అని తన స్నేహితుల దగ్గర చాలా ధీమాగా ఛాలెంజ్ చేశానని రవితేజ చెప్పాడు. ఆపై తాను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి హీరో ఫ్రెండుగా చిన్న చిన్న వేషాలు వేసి.. ‘అన్నయ్య’ సినిమాలో చిరుకు సోదరుడిగా నటించే గొప్ప అవకాశం అందుకున్నానని.. మళ్లీ ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’లో ఆయనతో కలిసి నటించే వరకు తన ప్రస్థానం సాగిందని చెప్పాడు. ఒకప్పుడు చిరు పక్కన కూర్చుంటానని తాను తన స్నేహితులతో అన్నానని.. కానీ ఆయన సంకనెక్కి కూర్చునే స్థాయిలో క్లోజ్ అయ్యానని.. అది తన అదృష్టమని రవితేజ చమత్కరించగా.. చిరు సహా అందరూ గొల్లున నవ్వేశారు.
This post was last modified on January 9, 2023 9:28 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…