Movie News

దిల్ రాజు కోరుకున్నది ఒకటి..

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కెరీర్లో ఎన్నడూ లేని సంకట స్థితిని ఎదుర్కొంటున్నాడు. ఓవైపు తెలుగులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి క్రేజీ చిత్రాలను కాదని.. డబ్బింగ్ సినిమా అయిన ‘వారసుడు’కు ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతుండడం పట్ల ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే.

దీనికి తోడు ‘వారసుడు’ తెలుగులో సమయానికి రిలీజవడం గురించి ఇప్పుడు కన్ఫ్యూజన్ నడుస్తోంది. మరోవైపు ‘వారసుడు’ ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, చాలా పాత తెలుగు సినిమాల కలబోతలా ఇది ఉండడం పట్ల నడుస్తున్న ట్రోలింగ్ సంగతి తెలిసిందే.

ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే.. విజయ్‌కు తిరుగులేని ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న తమిళనాడులో కూడా ఈ చిత్రానికి పరిస్థితులు ఏమంత కలిసి వస్తున్నట్లుగా కనిపించడం లేదు. తమిళనాట విజయ్ నంబర్ వన్ హీరో అని.. కాబట్టి సంక్రాంతికి ‘వారసుడు’కే ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని దిల్ రాజు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

ఐతే ‘వారిసు’కు తమిళంలో ఎక్కువ థియేటర్లు దక్కడం మాట అటుంచితే.. అజిత్ సినిమా ‘తునివు’తో పోలిస్తే స్క్రీన్లు, షోలు తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ‘తునివు’ను రిలీజ్ చేస్తున్నది తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్. అతడికి బలమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉందక్కడ.

థియేటర్ల మీద అజమాయిషీ ఉంది. దీంతో ‘తునివు’కు ఎక్కువ స్క్రీన్లు వచ్చేలా చేసుకున్నాడు. మల్టీప్లెక్సుల్లో దానిదే పైచేయి. మంచి మంచి స్క్రీన్లు తన సినిమాకే దక్కేలా చూసుకున్నాడు. అంతే కాక ‘తునివు’కు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు ప్లాన్ చేయించి.. మూడు గంటలు ఆలస్యంగా తెల్లవారుజామున 4 నుంచి విజయ్ మూవీకి బెనిఫిట్ షోలు పడేలా డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించాడు. అతడి మాట ప్రకారమే అందరూ నడుచుకుంటున్నారు.

తమిళనాడు అవతల ‘వారసుడు’దే పైచేయిగా కనిపిస్తున్నప్పటికీ తమిళనాట మాత్రం ‘తునివు’ ఆధిపత్యమే కనిపిస్తోంది ప్రస్తుతానికి. రాజు కోరుకున్నదానికి పూర్తి భిన్నంగా అక్కడ పరిస్థితి ఉండడం చర్చనీయాంశం అవుతోంది.

This post was last modified on January 8, 2023 3:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

30 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago