టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. సాంగ్స్ , పోస్టర్స్ తో ఎక్కడా చూసినా వీరయ్య , వీర సింహా రెడ్డి సినిమాల గురించే టాపిక్ నడుస్తుంది. ఇప్పటికే రిలీజ్ కి సంబంధించి అన్నీ పనులు పూర్తయ్యాయి. తాజాగా రెండు సినిమాలకు సెన్సార్ కూడా పూర్తయింది. రెండు సినిమాలు రన్ టైమ్ లాక్ చేసుకున్నాయి.
చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు రెండు గంటల నలబై నిమిషాల రన్ టైమ్ లాక్ చేశారు. ‘వీర సింహా రెడ్డి’ కి ఏకంగా రెండు గంటల నలబై తొమ్మిది నిమిషాల (వితౌట్ యాడ్స్) రన్ టైమ్ లాక్ చేసుకున్నారు. రన్ టైమ్ పరంగా వీరయ్య కంటే వీర సింహా రెడ్డినే పది నిమిషాలు ఎక్కువ. అయితే ఈ రెండు సినిమాలకు క్రిస్ప్ రన్ కాకుండా కాస్త ఎక్కువ లెంగ్త్ ఫిక్స్ చేయడంతో కొత్త చర్చ నడుస్తుంది.
ఈ కమర్షియల్ సినిమాలకు రెండున్నర గంటలు కాకుండా మరో పది, ఇరవై నిమిషాలు ఎక్కువ తీసుకొని దర్శకులు బాబీ , గోపీచంద్ మాలినేని ప్రేక్షకులను ఇబ్బంది పెడతారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. రన్ టైమ్ ఎక్కువ ఉండటం వల్ల ఈ మధ్య కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా బోర్ కొట్టించి థియేటర్స్ నుండి బయటికి పంపించాయి. వీరయ్య , వీర సింహా రెడ్డి లకు సంబందించి మేకర్స్ ఈ రన్ టైమ్ లాక్ చేసుకునే ముందు అవన్నీ ఆలోచించే ఉంటారు. ఫైనల్ గా కథ డిమాండ్ చేస్తే పరవాలేదు కానీ ఊరికే డ్రాగ్ చేసి లెంగ్త్ పెంచితే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
This post was last modified on January 5, 2023 2:34 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…