టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. సాంగ్స్ , పోస్టర్స్ తో ఎక్కడా చూసినా వీరయ్య , వీర సింహా రెడ్డి సినిమాల గురించే టాపిక్ నడుస్తుంది. ఇప్పటికే రిలీజ్ కి సంబంధించి అన్నీ పనులు పూర్తయ్యాయి. తాజాగా రెండు సినిమాలకు సెన్సార్ కూడా పూర్తయింది. రెండు సినిమాలు రన్ టైమ్ లాక్ చేసుకున్నాయి.
చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు రెండు గంటల నలబై నిమిషాల రన్ టైమ్ లాక్ చేశారు. ‘వీర సింహా రెడ్డి’ కి ఏకంగా రెండు గంటల నలబై తొమ్మిది నిమిషాల (వితౌట్ యాడ్స్) రన్ టైమ్ లాక్ చేసుకున్నారు. రన్ టైమ్ పరంగా వీరయ్య కంటే వీర సింహా రెడ్డినే పది నిమిషాలు ఎక్కువ. అయితే ఈ రెండు సినిమాలకు క్రిస్ప్ రన్ కాకుండా కాస్త ఎక్కువ లెంగ్త్ ఫిక్స్ చేయడంతో కొత్త చర్చ నడుస్తుంది.
ఈ కమర్షియల్ సినిమాలకు రెండున్నర గంటలు కాకుండా మరో పది, ఇరవై నిమిషాలు ఎక్కువ తీసుకొని దర్శకులు బాబీ , గోపీచంద్ మాలినేని ప్రేక్షకులను ఇబ్బంది పెడతారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. రన్ టైమ్ ఎక్కువ ఉండటం వల్ల ఈ మధ్య కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా బోర్ కొట్టించి థియేటర్స్ నుండి బయటికి పంపించాయి. వీరయ్య , వీర సింహా రెడ్డి లకు సంబందించి మేకర్స్ ఈ రన్ టైమ్ లాక్ చేసుకునే ముందు అవన్నీ ఆలోచించే ఉంటారు. ఫైనల్ గా కథ డిమాండ్ చేస్తే పరవాలేదు కానీ ఊరికే డ్రాగ్ చేసి లెంగ్త్ పెంచితే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
This post was last modified on January 5, 2023 2:34 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…