టాలీవుడ్ సంక్రాంతి రేస్ లో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య కృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో పాటు ‘కళ్యాణం కమనీయం’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. యూవీ కాన్సెప్ట్స్ బేనర్ పై సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. హీరో , హీరోయిన్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ రెండు బడా సినిమాల మధ్య ఈ చిన్న సినిమాకి సరైన ప్రమోషన్ దక్కడం లేదు. అందుకే స్వీటీ అనుష్క ఈ సినిమాకి సపోర్ట్ అందించబోతుంది.
‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు అనుష్క ద్వారా రిలీజ్ కాబోతుంది. థియేట్రికల్ ట్రైలర్ తో ఈ సినిమాపై కొంత బజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. యూవీ సంస్థతో అనుష్క కి మంచి రిలేషన్ ఉంది. ఈ బేనర్ లో ‘భాగమతి’ సినిమా చేసిన స్వీటీ ఇప్పుడు నవీన్ పోలిశెట్టి తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇక అనుష్క ప్రేక్షకులకు కనిపించి కూడా చాలా నెలలవుతుంది. ట్రైలర్ లాంచ్ వీడియో ద్వారా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది స్వీటీ.
సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ చిన్న సినిమా కోసం యూవీ సంస్థ తమ హీరోయిన్ ని ఇలా రంగంలో దింపుతుంది. మరి అనుష్క రిలీజ్ చేసే ఈ ట్రైలర్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందా ? చూడాలి.
This post was last modified on January 5, 2023 1:09 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…