టాలీవుడ్ సంక్రాంతి రేస్ లో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య కృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో పాటు ‘కళ్యాణం కమనీయం’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. యూవీ కాన్సెప్ట్స్ బేనర్ పై సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. హీరో , హీరోయిన్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ రెండు బడా సినిమాల మధ్య ఈ చిన్న సినిమాకి సరైన ప్రమోషన్ దక్కడం లేదు. అందుకే స్వీటీ అనుష్క ఈ సినిమాకి సపోర్ట్ అందించబోతుంది.
‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు అనుష్క ద్వారా రిలీజ్ కాబోతుంది. థియేట్రికల్ ట్రైలర్ తో ఈ సినిమాపై కొంత బజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. యూవీ సంస్థతో అనుష్క కి మంచి రిలేషన్ ఉంది. ఈ బేనర్ లో ‘భాగమతి’ సినిమా చేసిన స్వీటీ ఇప్పుడు నవీన్ పోలిశెట్టి తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇక అనుష్క ప్రేక్షకులకు కనిపించి కూడా చాలా నెలలవుతుంది. ట్రైలర్ లాంచ్ వీడియో ద్వారా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది స్వీటీ.
సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ చిన్న సినిమా కోసం యూవీ సంస్థ తమ హీరోయిన్ ని ఇలా రంగంలో దింపుతుంది. మరి అనుష్క రిలీజ్ చేసే ఈ ట్రైలర్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందా ? చూడాలి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…