టాలీవుడ్ సంక్రాంతి రేస్ లో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య కృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో పాటు ‘కళ్యాణం కమనీయం’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. యూవీ కాన్సెప్ట్స్ బేనర్ పై సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. హీరో , హీరోయిన్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ రెండు బడా సినిమాల మధ్య ఈ చిన్న సినిమాకి సరైన ప్రమోషన్ దక్కడం లేదు. అందుకే స్వీటీ అనుష్క ఈ సినిమాకి సపోర్ట్ అందించబోతుంది.
‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు అనుష్క ద్వారా రిలీజ్ కాబోతుంది. థియేట్రికల్ ట్రైలర్ తో ఈ సినిమాపై కొంత బజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. యూవీ సంస్థతో అనుష్క కి మంచి రిలేషన్ ఉంది. ఈ బేనర్ లో ‘భాగమతి’ సినిమా చేసిన స్వీటీ ఇప్పుడు నవీన్ పోలిశెట్టి తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇక అనుష్క ప్రేక్షకులకు కనిపించి కూడా చాలా నెలలవుతుంది. ట్రైలర్ లాంచ్ వీడియో ద్వారా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది స్వీటీ.
సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ చిన్న సినిమా కోసం యూవీ సంస్థ తమ హీరోయిన్ ని ఇలా రంగంలో దింపుతుంది. మరి అనుష్క రిలీజ్ చేసే ఈ ట్రైలర్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందా ? చూడాలి.
This post was last modified on January 5, 2023 1:09 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…