టాలీవుడ్ సంక్రాంతి రేస్ లో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య కృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో పాటు ‘కళ్యాణం కమనీయం’ అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. యూవీ కాన్సెప్ట్స్ బేనర్ పై సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. హీరో , హీరోయిన్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ రెండు బడా సినిమాల మధ్య ఈ చిన్న సినిమాకి సరైన ప్రమోషన్ దక్కడం లేదు. అందుకే స్వీటీ అనుష్క ఈ సినిమాకి సపోర్ట్ అందించబోతుంది.
‘కళ్యాణం కమనీయం’ ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు అనుష్క ద్వారా రిలీజ్ కాబోతుంది. థియేట్రికల్ ట్రైలర్ తో ఈ సినిమాపై కొంత బజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. యూవీ సంస్థతో అనుష్క కి మంచి రిలేషన్ ఉంది. ఈ బేనర్ లో ‘భాగమతి’ సినిమా చేసిన స్వీటీ ఇప్పుడు నవీన్ పోలిశెట్టి తో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇక అనుష్క ప్రేక్షకులకు కనిపించి కూడా చాలా నెలలవుతుంది. ట్రైలర్ లాంచ్ వీడియో ద్వారా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది స్వీటీ.
సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ చిన్న సినిమా కోసం యూవీ సంస్థ తమ హీరోయిన్ ని ఇలా రంగంలో దింపుతుంది. మరి అనుష్క రిలీజ్ చేసే ఈ ట్రైలర్ ఈ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుందా ? చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…