ఇరవై సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్న కాంబోగా చిరంజీవి రవితేజల కలయిక వాల్తేరు వీరయ్య మీద ఏ రేంజ్ లో అంచనాలు పెంచుతోందో చూస్తున్నాం. పూనకాలు లిరికల్ వీడియోకి దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్, పాటకు రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా ఇద్దరూ కలిసి డాన్స్ చేయడాన్ని మాత్రం ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తోడు నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ పలు ఇంటర్వ్యూలలో దీని గురించి ప్రత్యేకంగా ఊరిస్తూ చెప్పడంతో ఎప్పుడెప్పుడు చూద్దామనే ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. పాటే ఇలా ఉంటే పరస్పరం తలపడే సన్నివేశాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి రేగడం సహజం.
హైప్ కి తగ్గట్టే ఓ కీలకమైన లీక్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇంటర్వెల్ బ్లాక్ కు ముందు చిరు రవితేజలు ఒకరినొకరు పోలీస్ స్టేషన్ లో తలపడే సీన్ ఉంటుంది. మాస్ రాజా ఏసిపిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనతో సవాల్ విసురుతూ మెగాస్టార్ చెప్పే డైలాగ్ ‘సిటీకి కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు వీరయ్య లోకల్ ఇక్కడే ఉంటాడు’ అని అంటాడట. ఇది ఇడియట్ లో ఎంత పెద్ద సూపర్ హిట్ సంభాషణో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. దానికి కౌంటర్ గా రవితేజ సైతం ఘరానా మొగుడులో ఏదీ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పడం మాములుగా ఉండదట.
వింటేనే అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్న ఇలాంటివి దర్శకుడు బాబీ బాగానే సెట్ చేసినట్టు వినికిడి. ఈ నెల 13న విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య పెద్ద సినిమాల లిస్టులో చివరిగా రావడం పట్ల మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికి ఊర మాస్ కంటెంట్ గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఆ టైంకంతా వారసుడు, తెగింపు, వీరసింహారెడ్డి ఫలితాలు వచ్చేసి ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి స్క్రీన్ కౌంట్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలుంటాయి. ఈ నెల 8న వైజాగ్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధిందిన వేదికని ఇంకొద్ది గంటల్లో ఫైనల్ చేయబోతున్నారు.
This post was last modified on January 5, 2023 1:10 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…