ఇరవై సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్న కాంబోగా చిరంజీవి రవితేజల కలయిక వాల్తేరు వీరయ్య మీద ఏ రేంజ్ లో అంచనాలు పెంచుతోందో చూస్తున్నాం. పూనకాలు లిరికల్ వీడియోకి దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్, పాటకు రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా ఇద్దరూ కలిసి డాన్స్ చేయడాన్ని మాత్రం ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తోడు నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ పలు ఇంటర్వ్యూలలో దీని గురించి ప్రత్యేకంగా ఊరిస్తూ చెప్పడంతో ఎప్పుడెప్పుడు చూద్దామనే ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. పాటే ఇలా ఉంటే పరస్పరం తలపడే సన్నివేశాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి రేగడం సహజం.
హైప్ కి తగ్గట్టే ఓ కీలకమైన లీక్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇంటర్వెల్ బ్లాక్ కు ముందు చిరు రవితేజలు ఒకరినొకరు పోలీస్ స్టేషన్ లో తలపడే సీన్ ఉంటుంది. మాస్ రాజా ఏసిపిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనతో సవాల్ విసురుతూ మెగాస్టార్ చెప్పే డైలాగ్ ‘సిటీకి కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు వీరయ్య లోకల్ ఇక్కడే ఉంటాడు’ అని అంటాడట. ఇది ఇడియట్ లో ఎంత పెద్ద సూపర్ హిట్ సంభాషణో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. దానికి కౌంటర్ గా రవితేజ సైతం ఘరానా మొగుడులో ఏదీ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పడం మాములుగా ఉండదట.
వింటేనే అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్న ఇలాంటివి దర్శకుడు బాబీ బాగానే సెట్ చేసినట్టు వినికిడి. ఈ నెల 13న విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య పెద్ద సినిమాల లిస్టులో చివరిగా రావడం పట్ల మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికి ఊర మాస్ కంటెంట్ గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఆ టైంకంతా వారసుడు, తెగింపు, వీరసింహారెడ్డి ఫలితాలు వచ్చేసి ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి స్క్రీన్ కౌంట్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలుంటాయి. ఈ నెల 8న వైజాగ్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధిందిన వేదికని ఇంకొద్ది గంటల్లో ఫైనల్ చేయబోతున్నారు.
This post was last modified on January 5, 2023 1:10 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…