ఇరవై సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్న కాంబోగా చిరంజీవి రవితేజల కలయిక వాల్తేరు వీరయ్య మీద ఏ రేంజ్ లో అంచనాలు పెంచుతోందో చూస్తున్నాం. పూనకాలు లిరికల్ వీడియోకి దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్, పాటకు రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా ఇద్దరూ కలిసి డాన్స్ చేయడాన్ని మాత్రం ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తోడు నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ పలు ఇంటర్వ్యూలలో దీని గురించి ప్రత్యేకంగా ఊరిస్తూ చెప్పడంతో ఎప్పుడెప్పుడు చూద్దామనే ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. పాటే ఇలా ఉంటే పరస్పరం తలపడే సన్నివేశాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి రేగడం సహజం.
హైప్ కి తగ్గట్టే ఓ కీలకమైన లీక్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇంటర్వెల్ బ్లాక్ కు ముందు చిరు రవితేజలు ఒకరినొకరు పోలీస్ స్టేషన్ లో తలపడే సీన్ ఉంటుంది. మాస్ రాజా ఏసిపిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనతో సవాల్ విసురుతూ మెగాస్టార్ చెప్పే డైలాగ్ ‘సిటీకి కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు వీరయ్య లోకల్ ఇక్కడే ఉంటాడు’ అని అంటాడట. ఇది ఇడియట్ లో ఎంత పెద్ద సూపర్ హిట్ సంభాషణో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. దానికి కౌంటర్ గా రవితేజ సైతం ఘరానా మొగుడులో ఏదీ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పడం మాములుగా ఉండదట.
వింటేనే అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్న ఇలాంటివి దర్శకుడు బాబీ బాగానే సెట్ చేసినట్టు వినికిడి. ఈ నెల 13న విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య పెద్ద సినిమాల లిస్టులో చివరిగా రావడం పట్ల మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికి ఊర మాస్ కంటెంట్ గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఆ టైంకంతా వారసుడు, తెగింపు, వీరసింహారెడ్డి ఫలితాలు వచ్చేసి ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి స్క్రీన్ కౌంట్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలుంటాయి. ఈ నెల 8న వైజాగ్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధిందిన వేదికని ఇంకొద్ది గంటల్లో ఫైనల్ చేయబోతున్నారు.
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…
పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్…
శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…