ఇరవై సంవత్సరాల తర్వాత కలిసి నటిస్తున్న కాంబోగా చిరంజీవి రవితేజల కలయిక వాల్తేరు వీరయ్య మీద ఏ రేంజ్ లో అంచనాలు పెంచుతోందో చూస్తున్నాం. పూనకాలు లిరికల్ వీడియోకి దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్, పాటకు రెస్పాన్స్ సంగతి ఎలా ఉన్నా ఇద్దరూ కలిసి డాన్స్ చేయడాన్ని మాత్రం ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి తోడు నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ పలు ఇంటర్వ్యూలలో దీని గురించి ప్రత్యేకంగా ఊరిస్తూ చెప్పడంతో ఎప్పుడెప్పుడు చూద్దామనే ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. పాటే ఇలా ఉంటే పరస్పరం తలపడే సన్నివేశాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి రేగడం సహజం.
హైప్ కి తగ్గట్టే ఓ కీలకమైన లీక్ చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇంటర్వెల్ బ్లాక్ కు ముందు చిరు రవితేజలు ఒకరినొకరు పోలీస్ స్టేషన్ లో తలపడే సీన్ ఉంటుంది. మాస్ రాజా ఏసిపిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనతో సవాల్ విసురుతూ మెగాస్టార్ చెప్పే డైలాగ్ ‘సిటీకి కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు వీరయ్య లోకల్ ఇక్కడే ఉంటాడు’ అని అంటాడట. ఇది ఇడియట్ లో ఎంత పెద్ద సూపర్ హిట్ సంభాషణో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. దానికి కౌంటర్ గా రవితేజ సైతం ఘరానా మొగుడులో ఏదీ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పడం మాములుగా ఉండదట.
వింటేనే అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్న ఇలాంటివి దర్శకుడు బాబీ బాగానే సెట్ చేసినట్టు వినికిడి. ఈ నెల 13న విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య పెద్ద సినిమాల లిస్టులో చివరిగా రావడం పట్ల మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికి ఊర మాస్ కంటెంట్ గట్టి పోటీ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఆ టైంకంతా వారసుడు, తెగింపు, వీరసింహారెడ్డి ఫలితాలు వచ్చేసి ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి స్క్రీన్ కౌంట్ లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలుంటాయి. ఈ నెల 8న వైజాగ్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధిందిన వేదికని ఇంకొద్ది గంటల్లో ఫైనల్ చేయబోతున్నారు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…