ఇండియాలో జనాభా 130 కోట్ల దాకా ఉంది. అందులో యూట్యూబ్లో పాటల వీడియోలు చూసేవాళ్లు ఎంతమంది ఉంటారు? మొత్తం జనాభాలో సగం ఉన్నా గొప్పే. అలాంటిది ఒక ఇండియన్ సాంగ్కు యూట్యూబ్లో 90 కోట్ల వ్యూస్ వచ్చాయంటే అది ఏ స్థాయిలో జనాల హృదయాల్లోకి వెళ్లి ఉండాలి.. ఎన్ని చోట్ల ప్లే అవుతుండాలి..? ఆ పాట ఏ రేంజ్ హిట్టో చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి.
ఇంతకీ ఆ పాట ఏదీ అంటారా? తమిళంలో ధనుష్, సాయిపల్లవిల మీద తెరకెక్కి రౌడీ బేబీ సాంగ్. ఏడాదిన్నర కిందట విడుదలైన మారి-2 చిత్రంలోనిదీ పాట. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
ప్రభుదేవా చాలా కాలం తర్వాత తమిళంలో కంపోజ్ చేసిన పాట ఇది. ధనుష్, సాయిపల్లవి ఇద్దరూ సూపర్ డ్యాన్సర్లు కావడం.. ప్రభుదేవా అదిరిపోయే రేంజిలో స్టెప్స్ కంపోజ్ చేయడం.. చాలా కలర్ ఫుల్గా మంచి థీమ్తో, హుషారెత్తించేలా ఈ పాటను చిత్రీకరించడంతో ఇన్స్టంట్గా జనాలకు నచ్చేసింది. సినిమా విడుదలకు ముందే సంచలనం రేపిన ఈ పాట.. ఆ తర్వాత మరింతగా జనాల్ని ఆకట్టుకుంది.
దేశవిదేశాల్లో ఈ పాటకు ఆదరణ దక్కింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరూ ఈ పాటను చూసి ఆనందించారు. ఈ క్రమంలోనే యూట్యూబ్లో రికార్డుల మోత మోగిస్తూ వెళ్లింది. కోట్లల్లో వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఏకంగా 900 మిలియన్ మార్కును టచ్ చేసిందీ పాట. ఓ భారతీయ పాటకు ఈ స్థాయిలో ఆదరణ దక్కడం అద్భుతమనే చెప్పాలి.
This post was last modified on July 20, 2020 11:20 am
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…