ఇండియాలో జనాభా 130 కోట్ల దాకా ఉంది. అందులో యూట్యూబ్లో పాటల వీడియోలు చూసేవాళ్లు ఎంతమంది ఉంటారు? మొత్తం జనాభాలో సగం ఉన్నా గొప్పే. అలాంటిది ఒక ఇండియన్ సాంగ్కు యూట్యూబ్లో 90 కోట్ల వ్యూస్ వచ్చాయంటే అది ఏ స్థాయిలో జనాల హృదయాల్లోకి వెళ్లి ఉండాలి.. ఎన్ని చోట్ల ప్లే అవుతుండాలి..? ఆ పాట ఏ రేంజ్ హిట్టో చెప్పడానికి ఇంతకంటే రుజువేం కావాలి.
ఇంతకీ ఆ పాట ఏదీ అంటారా? తమిళంలో ధనుష్, సాయిపల్లవిల మీద తెరకెక్కి రౌడీ బేబీ సాంగ్. ఏడాదిన్నర కిందట విడుదలైన మారి-2 చిత్రంలోనిదీ పాట. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించాడు ఈ చిత్రానికి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
ప్రభుదేవా చాలా కాలం తర్వాత తమిళంలో కంపోజ్ చేసిన పాట ఇది. ధనుష్, సాయిపల్లవి ఇద్దరూ సూపర్ డ్యాన్సర్లు కావడం.. ప్రభుదేవా అదిరిపోయే రేంజిలో స్టెప్స్ కంపోజ్ చేయడం.. చాలా కలర్ ఫుల్గా మంచి థీమ్తో, హుషారెత్తించేలా ఈ పాటను చిత్రీకరించడంతో ఇన్స్టంట్గా జనాలకు నచ్చేసింది. సినిమా విడుదలకు ముందే సంచలనం రేపిన ఈ పాట.. ఆ తర్వాత మరింతగా జనాల్ని ఆకట్టుకుంది.
దేశవిదేశాల్లో ఈ పాటకు ఆదరణ దక్కింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరూ ఈ పాటను చూసి ఆనందించారు. ఈ క్రమంలోనే యూట్యూబ్లో రికార్డుల మోత మోగిస్తూ వెళ్లింది. కోట్లల్లో వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఏకంగా 900 మిలియన్ మార్కును టచ్ చేసిందీ పాట. ఓ భారతీయ పాటకు ఈ స్థాయిలో ఆదరణ దక్కడం అద్భుతమనే చెప్పాలి.
This post was last modified on July 20, 2020 11:20 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…