Movie News

టైమింగ్ మిస్సవుతున్న హిందీ అఖండ

బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన అఖండ నమోదు చేసిన సంచలనాలు అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అఘోరాగా బాలయ్య విశ్వరూపం, తమన్ టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లిష్టంగా అనిపించే కాన్సెప్ట్ లో దర్శకుడు బోయపాటి శీను ఆధ్యాత్మిక విషయాలను ఊర మాస్ టచ్ తో చెప్పడం ఘనవిజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే అంత పెద్ద సక్సెస్ అందుకుంది. డిస్నీ హాట్ స్టార్ ఓటిటిలో వచ్చాక కూడా అఖండ మిలియన్ వ్యూస్ తో సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. ఇదంతా జరిగి ఏడాది దాటిపోయింది.

ఇప్పుడు దీని హిందీ డబ్బింగ్ వెర్షన్ ని పెన్ సంస్థ భారీ ఎత్తున ఈ నెల 20న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఫ్యాన్స్ ఇంతకన్నా మంచి డేట్ దొరకలేదా అని పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే సరిగ్గా అయిదు రోజుల జనవరి 25కి షారుఖ్ ఖాన్ పఠాన్ కనివిని ఎరుగని రీతిలో అత్యధిక స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. సహజంగానే నార్త్ ఆడియన్స్ దృష్టి మిగిలిన వాటి మీద ఉండదు. ఏదో మీడియం రేంజ్ హీరోది అయితే టెన్షన్ అవసరం లేదు కానీ మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న బాద్షా మూవీ కావడంతో ప్రేక్షకుల దృష్టి సహజంగా పఠాన్ మీదే ఉంటుంది. అలాంటపుడు అయిదు రోజుల రన్ తో అఖండ ఏం సాధించినట్టు.

నిజానికి ఓ రెండు వారాల ముందు ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితం దక్కేది. దృశ్యం 2 తర్వాత బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రాలేదు. సర్కస్ మరీ ఘోరంగా టపా కట్టేసింది. మిగిలినవి వచ్చాయా అనేది కూడా గుర్తు లేనంతగా మాయమైపోయాయి. అలాంటప్పుడు కాంతార తరహా స్పిరిచువల్ టచ్ ఉన్న అఖండ లాంటి కమర్షియల్ డ్రామా ఆ అవకాశాన్ని వాడుకోవడానికి మంచి ఛాన్స్ ఉండేది. ఇప్పుడూ మరీ మించిపోలేదు కానీ పఠాన్ కు ఎలాంటి టాక్ వస్తుందనే దాన్ని బట్టే ఈ లెక్కలన్నీ ఆధారపడి ఉంటాయి.

This post was last modified on January 5, 2023 11:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

9 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago