ఒకప్పుడు మ్యూజికల్ బ్లాక్బస్టర్లు ఇచ్చి తనకు తానే సాటి అనిపించుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. ఈ మధ్య అంచనాలకు అందుకోలేకపోతున్నాడు. సంక్రాంతికి రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకు అతను అందించిన పాటలకు మిశ్రమ స్పందన వచ్చింది. టైటిల్ సాంగ్ మినహా పాటలు సాధారణంగా అనిపించాయి.
అందులోనూ చివరగా విడుదలైన పూనకాలు లోడింగ్ పాట విషయంలో విపరీతమైన నెగెటివిటీ కనిపించింది. దేవి మీద ఒక రేంజిలో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఒక ప్లాస్టిక్ గొట్టం లాంటిది నోట్లో పెట్టుకుని ఈ పాట లిరికల్ వీడియోలో దేవి ఊదుతూ కనిపించిన విజువల్ ట్రోలర్స్కు కావాల్సినంత కంటెంట్ ఇచ్చింది. ఈ బూర ఊదే సౌండే పాట ఆసాంతం వినిపించడం కొంచెం చికాకుగా అనిపించింది శ్రోతలకు.
ఈ ప్లాస్టిక్ గొట్టం వెనుక కథేంటో దర్శకుడు బాబీ, కొరియోగ్రాఫర్ శేఖర్లతో కలిసి ఇచ్చిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దేవి స్వయంగా వెల్లడించాడు. దేవి ఇండియాలో అయినా, ఫారిన్లో అయినా ఎక్కడెళ్లినా కొత్త కొత్త సంగీత పరికరాలు కొంటుంటాడట. ఒకసారి గోవాకు వెళ్లి అక్కడో పరికరం కోసం వెతుకుతున్నపుడు ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ షాపులో చిన్నపిల్లల బొమ్మలు కనిపించాయట. అందులో ఈ ప్లాస్టిక్ గొట్టం ఇంట్రెస్టింగ్గా అనిపించి కొన్నాడట దేవి. దాని ధర కేవలం 250 రూపాయలట. ఆ గొట్టం ఊదినిపుడు వచ్చే సౌండు డిఫరెంటుగా అనిపించి.. దాన్ని భద్రంగా దాచుకున్నాడట. పూనకాలు లోడింగ్ పాట కోసం ఆ గొట్టాన్నే ఉపయోగించి ట్యూన్ రెడీ చేశాడట.
అలా కేవలం 250 రూపాయలు పెట్టి కొన్ని ప్లాస్టిక్ గొట్టం.. ఇంత పెద్ద పాటకు ట్యూన్గా మారిందని.. ఈ పాటకు థియేటర్లు షేక్ అయిపోతాయని దేవి వ్యాఖ్యానించాడు.
This post was last modified on January 4, 2023 6:24 am
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…