సంక్రాంతి బరిలో గట్టి పోటీ మధ్య దిగుతున్న వాల్తేరు వీరయ్య ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ఆడియోలో నాలుగు పాటల్లో రెండు ఛార్ట్ బస్టర్ కాగా మరో రెండు మెల్లగా ఎక్కేస్తున్నాయి. అందరూ భయపడినట్టు కాకుండా దేవిశ్రీప్రసాద్ డీసెంట్ ఆల్బమ్ తో అభిమానులను సంతోషపరిచాడు. చిన్న ప్రెస్ మీట్ అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్ రేంజ్ లో యూనిట్ సభ్యులంతా మాట్లాడ్డం ఇటీవలే జరిగింది. ముందస్తు విడుదల వేడుకని వైజాగ్ ఆర్కె బీచ్ వేదికగా ఈ నెల 8న గ్రాండ్ గా చేయబోతున్నారు. దానికి రెండు రోజుల ముందు 6న జగదాంబ థియేటర్ లో ట్రైలర్ లాంచ్ ని భారీ ఎత్తున ప్లాన్ చేశారు.
ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ రవితేజ పోషించిన ఏసిపి విక్రమ్ సాగర్ ఐపిఎస్ జోడిగా నటించిన క్యాథరిన్ త్రెస్సా జాడ ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్క ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలాని ప్రమోషన్లో భాగం చేసినప్పుడు మరి క్యాథరిన్ ని కూడా చూపించాలి కదా. కనీసం ఆ ప్రస్తావన కూడా ఎక్కడా చేయడం లేదు. ఆల్రెడీ వచ్చిన లీక్స్ ప్రకారం తను ఇందులో మాస్ మహారాజా భార్యగా నటించింది. ఓ పాప కూడా ఉంటుంది. డ్యూయెట్లు లాంటివి లేకపోయినా కథకు సంబంధించిన ఓ కీలక మలుపు ఈ జంటకు ఉంటుందని అన్నారు. అలాంటప్పుడు యాక్టివ్ గా బయటికి తీసుకురావాలి కదా.
మర్చిపోయారో లేక ఏదైనా ట్విస్టు ఇద్దామని ఆగారో తెలియదు. ఆ మధ్య ఇలాగే ఆచార్యలో ముందు కాజల్ అగర్వాల్ ని తీసుకుని కొంత షూట్ కూడా చేసి ఆ తర్వాత ఎడిటింగ్ లో క్యారెక్టర్ ని మాయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాథరిన్ కి అలా చేస్తారని కాదు కానీ మరీ దాచిపెట్టేంత రహస్యం ఏమీ లేనప్పుడు చెప్పేస్తే అయిపోతుందిగా. 2022లో బింబిసార బ్లాక్ బస్టర్ హిట్ తో హ్యాపీగా ఉన్న క్యాథరిన్ కు ఇతర సినిమాల ఫలితాలు నిరాశ కలిగించాయి. ఒకవేళ వాల్తేరు వీరయ్యలో క్లిక్ అయితే ఇంకో బ్రేక్ రావొచ్చు. ఇంతకీ మీడియా ముందుకు ఎందుకు తీసుకురావడం లేదో వీరయ్యే చెప్పాలి. చూద్దాం.
This post was last modified on January 2, 2023 2:21 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…