నిన్న జరిగిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ షూటింగ్ సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానల్స్ లోనూ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేనిది ఒక ఓటిటి ఇంటర్వ్యూ షోకి స్టూడియో బయట లైవ్ కవరేజ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. అంతగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ల కలయిక అందరికీ సెన్సేషన్ గా మారింది. పాసులున్న అతికొద్ది మందికి మాత్రమే సెల్ ఫోన్లు లేకుండా కార్యక్రమం చూసే వీలు కల్పించారు. వాళ్ళ నుంచి వచ్చిన లీకులు గట్టిగానే బయట తిరుగుతున్నాయి. అందులో పవన్ పెళ్లిళ్లపై అడిగిన ప్రశ్నకు సమాధానం విని సంతృప్తి చెందిన బాలయ్య ఇకపై ఆ టాపిక్ మీద కామెంట్ చేసేవాళ్లను శునకాలతో పోల్చారట.
మధ్యలో ఒకసారి రామ్ చరణ్ తో ఫోన్ కాల్ చేయించి సరదా సంభాషణ చేసారని తెలిసింది. సాయి ధరమ్ తేజ్ ప్రత్యక్షంగా వచ్చి బాలకృష్ణ స్టైల్ లో తొడకొట్టడం హై లైట్ గా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు మోక్షజ్ఞని ప్రత్యేకంగా సెట్లోకి పిలిచి పవన్ తో ఫోటో తీయించిన వీడియో ఇద్దరి అభిమానులకు చాలా స్పెషల్ మూమెంట్ గా నిలిచిపోతుందని వినికిడి. త్రివిక్రమ్, క్రిష్ లు మధ్యలో వచ్చాక వాళ్ళతోనూ మాటామంతీ బాగా జరిగిందని టాక్. నిడివి ఎంతనేది బయటికి రాలేదు ఎడిటింగ్ పోనూ గంటకు పైగా ఫైనల్ ఫుటేజ్ లాక్ కావొచ్చని ఆహా వర్గాల సమాచారం.
అన్ స్టాపబుల్ సీజన్ 2ని ఇదే ఫైనల్ ఎపిసోడ్ గా ముగించబోతున్నట్టు తెలిసింది. మూడో సిరీస్ లోనే చిరంజీవి లాంటి వాళ్ళను ఆశించవచ్చు కానీ ప్రస్తుతానికి పవన్ ప్రభాస్ లే ఇప్పుడీ సెకండ్ సీజన్ ని కాచుకున్న బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ గా నిలవబోతున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరు అభిమానులు బాలయ్య పవన్ ల మీద పరస్పరం ట్రోలింగ్ కి దిగుతున్న సందర్భాలు ట్విట్టర్ వేదికగా కనిపిస్తున్నాయి. అక్కడ హీరోలేమో ఆనందంగా తమ బంధాన్ని ప్రదర్శిస్తుంటే కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇలా బురద జల్లే కార్యక్రమం పెట్టుకోవడం బాధాకరం. సంక్రాంతికి పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉండొచ్చు
This post was last modified on December 28, 2022 1:49 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…