యువ దర్శకుడు బాబీ.. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. టీనేజీలో అతను గుంటూరు జిల్లాలో చిరంజీవి అభిమాన సంఘంలో కీలకంగా వ్యవహరించాడు. చిరు మీద తన అభిమానాన్ని పలు సందర్భాల్లో అతను వ్యక్తం చేశాడు. అలాంటి అభిమానికి తన ఆరాధ్య కథానాయకుడిని డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఒక అభిమానిగా చిరును ఎలా చూడాలని తాను కోరుకుంటానో అలాగే చూపిస్తానని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నాడు బాబీ.
ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినపుడే అభిమానులకు వింటేజ్ చిరు కనిపించాడు. ‘ముఠామేస్త్రి’ లుక్ను గుర్తు చేసేలా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్లోనూ ‘ముఠా మేస్త్రి’ సహా చిరు పాత సినిమాల ఛాయలు కొన్ని కనిపించాయి. ‘బాస్ పార్టీ’ పాటలోనూ వింటేజ్ చిరును గుర్తుకు తెచ్చాడు బాబీ.
ఆ తర్వాత రిలీజ్ చేసిన ‘శ్రీదేవి’ పాటలో చిరుకు సంబంధించి కొన్ని వింటేజ్ పాటల మూమెంట్స్ను గుర్తుకు తెచ్చాయి. ‘ఇంద్ర’ అంత స్పీడు లేకపోయినా అందులోని వీణ స్టెప్ను గుర్తుకు తెచ్చే మూమెంట్ ఒకటి చేశాడు చిరు. అలాగే తన పాత స్టైల్ను గుర్తుకు చేసే ఒక మూమెంట్ కూడా చేశాడు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ అన్నింటికంటే ఎక్కువ కిక్ ఇస్తోంది. హీరోయిజంను అదిరిపోయేలా ఎలివేట్ చేస్తూ సాగిన ఈ పాట లిరికల్ వీడియోతోనే అభిమానులకు పూనకాలు తెప్పించింది.
ఇప్పటిదాకా ‘పూనకాలు లోడింగ్’ అంటుంటే అది మాట వరసకు అన్నట్లే ఉండేది కానీ.. ఇప్పుడు మాత్రం నిజంగా ఆ మాట అభిమానుల నోటి నుంచి వినిపిస్తోంది. ఈ పాట చూసిన చాలామందికి చిరు ‘లంకేశ్వరుడు’ సినిమా గుర్తుకొస్తోంది. అదే లుక్లో గన్ను పట్టుకుని చిరు ఇచ్చిన పోజులు నిన్నటితరం అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తున్నాయి. మొత్తానికి బాబీ ముందు అన్నట్లే ‘వింటేజ్ చిరు’ను గుర్తుకు తెస్తూ ముందుకు సాగుతున్నాడు. సినిమాలో కూడా అదే ఫీలింగ్ తీసుకొచ్చి అభిమానులను అలరిస్తాడేమో చూడాలి.
This post was last modified on December 27, 2022 7:04 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…