టాలీవుడ్లో ఇప్పుడు మాంచి ఊపు మీద ఉన్న యంగ్ హీరో అడివి శేష్. అతణ్ని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒకడని కూడా చెప్పొచ్చు. ఇటీవలే 38వ పుట్టిన రోజును జరుపుకున్న శేష్.. ఇంకా పెళ్లి ఊసు ఎత్తట్లేదు. ఏదైనా ఇంటర్వ్యూలో, లేదా టీవీ షోల్లో పెళ్లి ఊసు ఎత్తితే చాలు.. సమాధానం దాటవేస్తాడు.
ఐతే శేష్ సింగిల్ మాత్రం కాదన్నది అతడి సన్నిహిత వర్గాల మాట. టాలీవుడ్లో ఒక లేడీ ప్రొడ్యూసర్తో అతను రిలేషన్షిప్లో ఉన్నట్లుగా ప్రచారాలు జరగడం తెలిసిందే. ఐతే ఆమె ఎవరన్నది బహిరంగంగా ఎవరూ వెల్లడించలేదు. కానీ శేష్ ఈ విషయంపై తనే ఓపెన్ అయిపోయాడా అన్న చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఈ చర్చకు అవకాశమిచ్చింది అక్కినేని ఫ్యామిలీ వారి క్రిస్మస్ సెలబ్రేషన్లకు సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన ఒక ఫొటోనే.
ఇందులో పది మందికి పైగానే అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారు. సుమంత్, సుశాంత్, అఖిల్, సుప్రియ.. ఇలా పలువురు అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్న ఫొటోలో ఉన్న ఒకే ఒక ఔట్ సైడర్ అడివి శేష్. ఇది అందరిలోనూ క్యూరియాసిటీ రేకెత్తించింది. అతను సుప్రియ పక్కన ఉండడం మరింత చర్చకు తావిచ్చింది. శేష్ రిలేషన్షిప్లో ఉన్నది సుప్రియతోనే అన్న చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది.
వీళ్లిద్దరికీ శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమా టైంలో పరిచయం జరిగింది. ఆ సినిమాలో సుప్రియ నిర్మాణ భాగస్వామే కాక.. ఒక ప్రత్యేక పాత్ర కూడా పోషించింది. అప్పుడు మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమకు దారి తీసినట్లుగా భావిస్తున్నారు. ఇన్నాళ్లూ శేష్ ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నాడనే విషయంపై ఎవరూ ఓపెన్గా మాట్లాడలేదు. కానీ తాజా ఫొటోతో శేష్, సుప్రియలిద్దరూ ఓపెన్ అయిపోయినట్లుగా భావిస్తుండడంతో దీనిపై చర్చోప చర్చలు నడుస్తున్నాయి.
This post was last modified on December 26, 2022 2:07 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…