మెగాస్టార్ చిరంజీవి నుంచి రానున్న కొత్త చిత్రం.. వాల్తేరు వీరయ్య. చిరంజీవికి వీరాభిమాని అయిన స్టార్ డైరెక్టర్ బాబీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ఖరారైన దగ్గర్నుంచి బాబీ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో చిరంజీవి అభిమాన సంఘంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి.. ఇప్పుడు చిరును డైరెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. తన అభిమాన హీరోను ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించబోతున్నానని ముందు నుంచి చెబుతూ వస్తున్నాడు బాబీ.
ఐతే రిలీజ్ ముంగిట ఈ సినిమా ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదని మెగా అభిమానుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, బాబీ కలిసి తాజాగా చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో బాబీ మాట్లాడుతూ.. ‘వాల్తేరు వీరయ్య’ విషయంలో అభిమానులు ధీమాగా థియేటర్లకు రావచ్చని అన్నాడు.
తాను చిరు అభిమానిగా ఉన్న రోజులతో మొదలుపెట్టి.. ‘వాల్తేరు వీరయ్య’ను ఎలా తీర్చిదిద్దానో వివరిస్తూ అభిమానుల్లో జోష్ నింపాడు బాబీ. “ఇంద్ర సినిమాకు ముందు చిరంజీవి గారి రెండు సినిమాలు సరిగా ఆడలేదు. ఆయన్నుంచి ఒక బ్లాక్బస్టర్ వస్తే చూడాలని కసిగా ఎదురు చూశా. అలాంటి సమయంలో నా ఆకలి తీర్చిన సినిమా.. ఇంధ్ర. ఆ సినిమా చూసి కాలర్ ఎగరేసుకుని తిరిగా. ‘ఇంద్ర’ చూడడం కోసం లాఠీ దెబ్బలు తిన్నా. అలాంటి నాకు మెగాస్టార్ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఈ సినిమాకు సంబంధించి మనం చాలా సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే నేను కథ రాస్తూ లేదంటే సినిమా తీస్తూ ఈ మాట చెప్పట్లేదు. సినిమా చూశాక మాట్లాడుతున్నా. చిరంజీవి గారి నుంచి అభిమానులు ఆశించే ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉణ్నాయి. ఈ సినిమా మెగా అభిమానుల ఆకలి తీరుస్తుందని మాటిస్తున్నా” అని బాబీ చెప్పాడు.
This post was last modified on December 26, 2022 2:17 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…