ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో, భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమని, జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన అద్భుతాలను చూడడానికి రెండు కళ్లూ చాలలేదని అంటుంటే.. మరికొందరేమో ఎఫెక్ట్స్ మీద పెట్టిన శ్రద్ధ.. కథాకథనాల మీద పెట్టలేదని.. లెంగ్త్ మరీ ఎక్కువ అయి సినిమా బోర్ కొట్టేసిందని కామెంట్ చేస్తున్నారు.
ఐతే తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే ‘అవతార్-2’ ప్యాక్డ్ హౌసెస్తో నడిచింది. దేశవ్యాప్తంగా కూడా త్రీడీ వెర్షన్లు చూడడానికి జనం పోటెత్తారు. ప్రపంచ స్థాయిలో కూడా ‘అవతార్’ తొలి రోజు భారీ వసూళ్లనే రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్లయితే వసూళ్లు వచ్చేలా లేవు.
ఇండియా వరకు చూస్తే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఆల్ టైం హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. మూడేళ్ల కిందట ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్’ రూ.53 కోట్ల గ్రాస్ వసూళ్లతో కొత్త రికార్డు నెలకొల్పింది. ‘అవతార్-2’ ఎప్పుడు వస్తే అప్పుడు ఈ రికార్డు బద్దలు కావడం లాంఛనమే అనుకున్నారు.
అందులోనూ ఈ సినిమా రిలీజ్ వీక్లో ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ రిలీజ్లు లేవు. పూర్తిగా ఇండియన్ బాక్సాఫీస్ను ఈ సినిమాకే రాసిచ్చేశారు. ‘అవెంజర్స్’తో పోలిస్తే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఎక్కువ. అలాగే టికెట్ల ధరలు కూడా ఎక్కువే. కాబట్టి రికార్డు బద్దలవడం పక్కా అనుకున్నారు.
కానీ ‘అవతార్-2’ ఇండియా డే-1 వసూళ్లు రూ.40 కోట్లకు అటు ఇటుగా ఉన్నట్లు ట్రేడ్ పండిట్ల అంచనా. మామూలుగా చూస్తే ఇది చాలా పెద్ద నంబరే. బాలీవుడ్ భారీ చిత్రాలు అందులో సగం కూడా రాబట్టలేకపోతున్న రోజుల్లో ఈ వసూళ్లు గొప్ప అనే చెప్పాలి. కానీ సినిమా మీద ఉన్న భారీ అంచనాలు, అనుకూల బాక్సాఫీస్ పరిస్థితుల్లో ‘అవతార్-2’ అండర్ పెర్ఫామ్ చేసినట్లే.
This post was last modified on December 17, 2022 2:17 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…