ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో, భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమని, జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన అద్భుతాలను చూడడానికి రెండు కళ్లూ చాలలేదని అంటుంటే.. మరికొందరేమో ఎఫెక్ట్స్ మీద పెట్టిన శ్రద్ధ.. కథాకథనాల మీద పెట్టలేదని.. లెంగ్త్ మరీ ఎక్కువ అయి సినిమా బోర్ కొట్టేసిందని కామెంట్ చేస్తున్నారు.
ఐతే తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే ‘అవతార్-2’ ప్యాక్డ్ హౌసెస్తో నడిచింది. దేశవ్యాప్తంగా కూడా త్రీడీ వెర్షన్లు చూడడానికి జనం పోటెత్తారు. ప్రపంచ స్థాయిలో కూడా ‘అవతార్’ తొలి రోజు భారీ వసూళ్లనే రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్లయితే వసూళ్లు వచ్చేలా లేవు.
ఇండియా వరకు చూస్తే ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఆల్ టైం హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. మూడేళ్ల కిందట ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్’ రూ.53 కోట్ల గ్రాస్ వసూళ్లతో కొత్త రికార్డు నెలకొల్పింది. ‘అవతార్-2’ ఎప్పుడు వస్తే అప్పుడు ఈ రికార్డు బద్దలు కావడం లాంఛనమే అనుకున్నారు.
అందులోనూ ఈ సినిమా రిలీజ్ వీక్లో ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ రిలీజ్లు లేవు. పూర్తిగా ఇండియన్ బాక్సాఫీస్ను ఈ సినిమాకే రాసిచ్చేశారు. ‘అవెంజర్స్’తో పోలిస్తే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఎక్కువ. అలాగే టికెట్ల ధరలు కూడా ఎక్కువే. కాబట్టి రికార్డు బద్దలవడం పక్కా అనుకున్నారు.
కానీ ‘అవతార్-2’ ఇండియా డే-1 వసూళ్లు రూ.40 కోట్లకు అటు ఇటుగా ఉన్నట్లు ట్రేడ్ పండిట్ల అంచనా. మామూలుగా చూస్తే ఇది చాలా పెద్ద నంబరే. బాలీవుడ్ భారీ చిత్రాలు అందులో సగం కూడా రాబట్టలేకపోతున్న రోజుల్లో ఈ వసూళ్లు గొప్ప అనే చెప్పాలి. కానీ సినిమా మీద ఉన్న భారీ అంచనాలు, అనుకూల బాక్సాఫీస్ పరిస్థితుల్లో ‘అవతార్-2’ అండర్ పెర్ఫామ్ చేసినట్లే.
This post was last modified on December 17, 2022 2:17 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…