విక్టరీ వెంకటేష్ ఎందుకో ఉన్నట్లుండి జోరు తగ్గించేశారు. చాలా ఏళ్ల నుంచి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ సీనియర్ హీరో.. ఒక దశలో ఒకేసారి రెండు సినిమాల్లోనూ నటించారు. అలాంటిది ‘ఎఫ్-3’ విడుదలై ఆరు నెలలు కావస్తున్నా తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. మధ్యలో ‘ఓరి దేవుడా’ సినిమాలో చిన్న క్యామియో చేయడం తప్పితే.. వెంకీ యాక్టివ్గా లేడు. తన కొత్త చిత్రం విషయంలో వెంకీ ఇంత టైం తీసుకోవడం ఈ మధ్య కాలంలో చూడలేదు.
ఐతే వెంకీకి ఉద్దేశపూర్వకంగా బ్రేక్ తీసుకునే ఆలోచనేమీ ఉన్నట్లు లేదు. ముందు అనుకున్న ప్రాజెక్టులు కుదరక ఆయనకు అనుకోకుండా ఈ గ్యాప్ వచ్చేసింది. తరుణ్ భాస్కర్తో అనుకున్న కథ వర్కవుట్ కాక అది అటకెక్కేయగా.. మధ్యలో అనుదీప్ కేవీ పేరు తెరపైకి వచ్చింది. వెంకీతో మాంచి ఎంటర్టైనర్ తీయాలని అనుదీప్ అనుకున్నాడు.
కానీ ‘జాతిరత్నాలు’ తర్వాత తనపై పెరిగిన అంచనాలను ‘ప్రిన్స్’తో అనుదీప్ అందుకోలేకపోయాడు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబుకు అనుదీప్ మీద గురి కుదరలేదో ఏమో.. వెంకీతో ఈ యువ దర్శకుడి సినిమాను హోల్ట్లో పెట్టినట్లున్నారు. కాగా ఇప్పుడు వెంకీ లిస్టులోకి కొత్త దర్శకుడు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడే శైలేష్ కొలను. ‘హిట్’ ఫ్రాంఛైజీతో ఈ యంగ్ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీలో బాగా నానుతోంది. ముఖ్యంగా ‘హిట్-2’ బ్లాక్బస్టర్ కావడంతో శైలేష్తో సినిమా చేయడానికి స్టార్లు కూడా ఆసక్తితో ఉంటారనడంలో సందేహం లేదు.
ఐతే ఆల్రెడీ ‘హిట్-3’ని అనౌన్స్ చేసిన శైలేష్.. దానికంటే ముందు వెంకీతో ఒక క్రైమ్ థ్రిల్లర్ తీయాలని చూస్తున్నట్లు సమాచారం. వెంకీకి అతను ఒక కథ కూడా వినిపించినట్లుగా వార్తలొస్తున్నాయి. ‘విక్రమ్’ స్టయిల్లో ఈ సినిమా ఉండొచ్చని అంటున్నారు. శైలేష్ లిమిటెడ్ బడ్జెట్లో, వేగంగా సినిమా తీస్తాడు కాబట్టి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రావచ్చు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు.
This post was last modified on December 16, 2022 6:12 am
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…