హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత సినిమా తీసిన గుణశేఖర్.. దాని తర్వాత ‘హిరణ్య కశ్యప’ను అంతకుమించినయ భారీ తనంతో తీయాలనుకున్నాడు. ఈసారి సొంత ప్రొడక్షన్లో కాకుండా సురేష్ బాబు నిర్మాణంలో సినిమా చేయడానికి గుణశేఖర్ రెడీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లు గుణశేఖర్, సురేష్ బాబు ఈ ప్రాజెక్టు కోసం కలిసి ప్రయాణం సాగించారు.
రూ.200 కోట్ల ఖర్చుతో రానా హీరోగా ఈ సినిమా తీయడానికి సురేష్ బాబు ఒక టైంలో సీరియస్గానే రంగంలోకి దిగాడు. గుణశేఖర్ కొన్నేళ్ల పాటు ఈ కథ రీసెర్చ్, స్క్రిప్టు పనిలో నిమగ్నం అయ్యాడు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. గుణశేఖర్ శాకుంతలం మీదికి వెళ్లిపోయాడు. బహుశా కొన్నేళ్లుగా లో బడ్జెట్ సినిమాలకే పరిమితం అవుతున్న సురేష్ బాబు.. అంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేయలేక వెనక్కి తగ్గి ఉంటారని అంతా అనుకున్నారు.
కానీ సురేష్ బాబు ఇప్పుడు అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. హిరణ్య కశ్యప సినిమా తమ ప్రొడక్షన్లోనే తెరకెక్కుతుందని.. కానీ దర్శకుడు వేరు అని ఆయన వెల్లడించడం గమనార్హం. హిరణ్య కశ్యపకు మారితే నిర్మాత మారుతాడేమో.. దర్శకుడిగా గుణశేఖరే ఉంటాడని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కోసం అంత కష్టపడ్డాడు గుణ. రుద్రమదేవి తీసిన అనుభవంతో ఈ చిత్రానికి బాగానే తెరకెక్కించగలడని కూడా అనుకున్నారు.
అసలు ఈ సినిమా ఆలోచన చేసింది, స్క్రిప్టు రెడీ చేసిందే గుణ. తర్వాత సురేష్ ప్రొడక్షన్ సీన్లోకి వచ్చింది. అలాంటిది అతను కాకుండా వేరే దర్శకుడితో ఈ సినిమా చేస్తామని సురేష్ బాబు ప్రకటించడం ఎవరికీ మింగుడుపడడం లేదు. శాకుంతలంను హిట్ చేసి గుణ ఈ ప్రాజెక్టును మొదలుపెడతాడనుకుంటే.. ఇప్పుడు ఇది పెద్ద ట్విస్టే. దీనిపై గుణ ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on December 11, 2022 10:14 am
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…