హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత సినిమా తీసిన గుణశేఖర్.. దాని తర్వాత ‘హిరణ్య కశ్యప’ను అంతకుమించినయ భారీ తనంతో తీయాలనుకున్నాడు. ఈసారి సొంత ప్రొడక్షన్లో కాకుండా సురేష్ బాబు నిర్మాణంలో సినిమా చేయడానికి గుణశేఖర్ రెడీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లు గుణశేఖర్, సురేష్ బాబు ఈ ప్రాజెక్టు కోసం కలిసి ప్రయాణం సాగించారు.
రూ.200 కోట్ల ఖర్చుతో రానా హీరోగా ఈ సినిమా తీయడానికి సురేష్ బాబు ఒక టైంలో సీరియస్గానే రంగంలోకి దిగాడు. గుణశేఖర్ కొన్నేళ్ల పాటు ఈ కథ రీసెర్చ్, స్క్రిప్టు పనిలో నిమగ్నం అయ్యాడు. కానీ తర్వాత ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. గుణశేఖర్ శాకుంతలం మీదికి వెళ్లిపోయాడు. బహుశా కొన్నేళ్లుగా లో బడ్జెట్ సినిమాలకే పరిమితం అవుతున్న సురేష్ బాబు.. అంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేయలేక వెనక్కి తగ్గి ఉంటారని అంతా అనుకున్నారు.
కానీ సురేష్ బాబు ఇప్పుడు అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. హిరణ్య కశ్యప సినిమా తమ ప్రొడక్షన్లోనే తెరకెక్కుతుందని.. కానీ దర్శకుడు వేరు అని ఆయన వెల్లడించడం గమనార్హం. హిరణ్య కశ్యపకు మారితే నిర్మాత మారుతాడేమో.. దర్శకుడిగా గుణశేఖరే ఉంటాడని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కోసం అంత కష్టపడ్డాడు గుణ. రుద్రమదేవి తీసిన అనుభవంతో ఈ చిత్రానికి బాగానే తెరకెక్కించగలడని కూడా అనుకున్నారు.
అసలు ఈ సినిమా ఆలోచన చేసింది, స్క్రిప్టు రెడీ చేసిందే గుణ. తర్వాత సురేష్ ప్రొడక్షన్ సీన్లోకి వచ్చింది. అలాంటిది అతను కాకుండా వేరే దర్శకుడితో ఈ సినిమా చేస్తామని సురేష్ బాబు ప్రకటించడం ఎవరికీ మింగుడుపడడం లేదు. శాకుంతలంను హిట్ చేసి గుణ ఈ ప్రాజెక్టును మొదలుపెడతాడనుకుంటే.. ఇప్పుడు ఇది పెద్ద ట్విస్టే. దీనిపై గుణ ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on December 11, 2022 10:14 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…