పూరి జగన్నాథ్కు ఈ మధ్య ఫిలిం మేకర్గా కంటే ఫిలాసఫర్గా ఎక్కువ పేరు సంపాదించారు. తన సినిమాల్లో యూత్కు సూటిగా తాకే ఫిలసాఫికల్ డైలాగ్స్తో ఆయన ఎప్పట్నుంచో తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తున్నారు. ఐతే కొన్నేళ్ల కిందట్నుంచి మొదలైన పాడ్ కాస్ట్ ట్రెడిషన్ను అందిపుచ్చుకుని పూరి మ్యూజింగ్స్ పేరుతో వివిధ అంశాలపై సూటిగా సుత్తి లేకుండా తన అభిప్రాయాలను చెబుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కేవలం ఈ మ్యూజింగ్స్ వరకే పూరికి ఒక అభిమాన వర్గం తయారైంది.
ఆ పాడ్ కాస్ట్ లను వింటూ.. ఇంత విషయం ఉన్న పూరి ఆ కంటెంట్ను తన సినిమాల్లో ఎందుకు చూపించట్లేదని ఆశ్చర్యపోతున్నారు ఆయన ఫ్యాన్స్. ఐతే కొన్ని టాపిక్స్ మీద ఆయన షార్ప్ ఒపీనియన్స్ చూసి.. ‘లైగర్’ మూవీలో అదే పంచ్ చూపిస్తారని ఆశపడ్డ అభిమానులూ ఉన్నారు. కానీ వాళ్లందరికీ నిరాశ తప్పలేదు.
‘లైగర్’ సినిమా పూరి కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా చూసి ఇక పూరి సినిమాలు ఆపేస్తే బెటర్ అన్నారు చాలామంది. మరీ ఇంత ఔట్ డేటెడ్ సినిమాను ఈ రోజుల్లో పూరి ఎలా తీశాడు.. ఇది ఆడుతుందని ఎలా నమ్మాడు అని ాశ్చర్యపోయారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత పూరి మీద మామూలు ట్రోలింగ్ జరగలేదు. ఆ ట్రోల్స్లో పాడ్ కాస్ట్ టాపిక్ కూడా వచ్చింది. పూరి మ్యూజింగ్స్లో మాటలు చెప్పడం తప్ప.. సినిమాలు తీయడంలో పూరి తన ప్రతిభను చూపించట్లేదంటూ కౌంటర్లు వేశారు.
ఈ సంగతిలా ఉంటే.. ‘లైగర్’ నష్టాలకు సంబంధించి బయ్యర్లతో గొడవ, ఈ సినిమా పెట్టుబడులపై ఈడీ విచారణ.. ఈ పరిణామాలంతా చూశాక పూరి ఇక ‘మ్యూజింగ్స్’ జోలికి వెళ్లే సాహసం చేయడని.. ఎవరికీ క్లాసులు పీకడని అనుకున్నారు. కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి పూరి మళ్లీ ‘మ్యూజింగ్స్’ను మొదలుపెట్టడం విశేషం. ఈసారి ఆయన ‘తడ్కా’ అనే టాపిక్ మీద మాట్లాడారు. తడ్కా అంటే మసాలా కలపడం అని.. ఈ పని ప్రతి మనిషీ చేస్తారని అంటూ పూరి తనదైన శైలిలో మనుషుల మనోభావాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ డీలా పడిపోకుండా వెంటనే పైకి లేచి సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటాడు పూరి. అందుకే పూరిని దర్శకుడిగానే కాక వ్యక్తిగానూ చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈసారి తన ‘మ్యూజింగ్స్’ టచ్ను సినిమాలోనూ చూపిస్తూ ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వాలన్నది అభిమానుల ఆకాంక్ష.
This post was last modified on December 10, 2022 2:51 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…