స్టార్ హీరోకు ఒకే సంగీత దర్శకుడు సింక్ అవ్వడమనేది ఈ మధ్య కాలంలో చాలా అరుదైపోయింది. స్థిరంగా హిట్లిచ్చే మ్యూజిక్ డైరెక్టర్లు బాగా తగ్గిపోయారు. ఒకప్పుడు మణిశర్మ ఈ రేంజ్ స్టార్ డం బాగా ఎంజాయ్ చేశారు. చిరంజీవి బాలకృష్ణలతో మొదలుకుని అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు దాకా అందరికీ ఆయనే బెస్ట్ ఛాయస్ గా ఉండేవారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టే ఎన్ని అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చారో లెక్క లేదు. తొంభై దశకంలో ఇళయరాజా ప్రభంజనం ఇంతకు మించి ఉండేది. ఒక టైంలో దేవిశ్రీ ప్రసాద్ ఈ దశను బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బాలయ్యకు తమన్ ఇలాగే సింక్ అవుతున్నాడు.
ఇవాళ ప్రారంభమైన ఎన్బికె 108కు ముచ్చటగా మూడో సారి బాలకృష్ణతో తమన్ కాంబినేషన్ సెట్ అయ్యింది. అఖండ గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉంటారు. వీరసింహారెడ్డికి ఇచ్చిన స్కోర్ గురించి ఇన్ సైడ్ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. రిలీజైన ఒక పాట మీద ఫీడ్ బ్యాక్ సంగతి ఎలా ఉన్నా బీజీఎమ్ తో మాత్రం అదరగొట్టాడనే మాటే వినిపిస్తోంది. అంతగా మెప్పిస్తున్నప్పుడు తమన్ కాక ఇంకెవరిని ఎంచుకుంటారు. దర్శకుడు అనిల్ రావిపూడి వరసగా ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 తరువాత దేవిశ్రీ ప్రసాద్ ని కాదని తమన్ కు ఎస్ చెప్పడం వెనుక బాలయ్య ప్రోత్సాహమేనని వేరే చెప్పాలా.
మొత్తానికి తమన్ టైం బ్రహ్మాండంగా ఉంది. సీనియర్లతో మొదలుకుని జూనియర్ల దాకా అందరికీ పని చేసిన అరుదైన ఘనతను గొప్ప ఆల్బమ్స్ తో బలపరుచుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం తన చేతిలో రామ్ చరణ్ 15, మహేష్ బాబు 28 లాంటి చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్ వారసుడు దెబ్బకు కోలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మధ్యలో సర్కారు వారి పాట లాంటి సినిమాలు తన స్థాయిలో లేవనే కామెంట్స్ తెచ్చుకున్నప్పటికీ స్టార్ హీరో ఎవరైనా సరే తర్వాతి బెస్ట్ ఆప్షన్ ఏదీ లేకుండా పోతున్న తరుణంలో తమన్ స్పీడుకు బ్రేకులు పడటం ఇప్పట్లో జరిగేలా లేదు. అందుకే ఓన్లీ ఛాయస్ గా అదరగొడుతున్నాడు.
This post was last modified on December 8, 2022 12:21 pm
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది.…
వాయిదాల ప్రచారాలకు చెక్ పెడుతూ నిన్న ప్యారడైజ్ బృందం మరోసారి సెప్టెంబర్ 24 విడుదలని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.…
ప్యాన్ ఇండియా పేరుతో ప్రతి హీరో వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్ల వెనుక పడటంతో సినిమాల వేగం తగ్గిపోయింది. టయర్ 2,…
ఢిల్లీలో ఏడుగురి ప్రాణాలు తీసిన సత్య నికేతన్ భవనం ఘటనలో ఒక విషయం ఎక్కువగా ఆలోచింపజేస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు…
హైదరాబాద్కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత…
సినిమా చూడాలంటే బుక్మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…