ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల దృష్టి ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ చిత్రం వీరసింహారెడ్డి మీదే ఉండబోతోందన్నది స్పష్టం. వీటికి తోడు విజయ్ అనువాద చిత్రం వారసుడు కూడా పెద్ద స్థాయిలోనే రిలీజ్ కాబోతోంది. అందుక్కారణం ఆ చిత్రాన్ని నిర్మించింది టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కావడమే. దీని దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తెలుగువాడేనన్న సంగతి తెలిసిందే.
మెజారిటీ థియేటర్లను ఈ మూడు చిత్రాలను పంచుకుంటే.. మరో అనువాద చిత్రం తునివు నామమాత్రంగా రిలీజవుతుందని అనుకున్నారంతా. అజిత్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఐతే తెలుగు రాష్ట్రాల్లో మిగతా మూడు సంక్రాంతి సినిమాలకు లేని అడ్వాంటేజ్ అజిత్ సినిమాకు దక్కబోతుండడం విశేషం.
సంక్రాంతికి పోటీయే లేకుండా సోలోగా ఒక్క రోజంతా బ్యాటింగ్ చేయబోతున్న సినిమా తునివు మాత్రమే. ఈ చిత్రం జనవరి 11, బుధవారం రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాతి రోజు వీరసింహారెడ్డి, వారసుడు విడుదలవుతాయి. 13న వాల్తేరు వీరయ్య రాబోతోంది. సంక్రాంతికి భారీ పోటీ ఉండడంతో ముందు వారం ఎలాగూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావు. థియేటర్లన్నీ ఖాళీగా ఉంటాయి. కాబట్టి 11న రిలీజయ్యే తునివు చిత్రానికి కావాల్సినన్ని థియేటర్లు, షోలు దక్కుతాయి.
సినిమాకు టాక్ బాగుండాలే కానీ.. వసూళ్లు కుమ్మేసుకోవచ్చు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు కూడా తక్కువగా, రూ.3 కోట్లకే ఇచ్చినట్లు సమాచారం. కాబట్టి మంచి ట్రైలర్ వదిలి హైప్ తీసుకురాగలిగితే, డే-1 పెద్ద సంఖ్యలో థియేటర్లు దక్కుతాయి కాబట్టి రికవరీ చాలా ఈజీనే అవుతుంది.
This post was last modified on December 8, 2022 6:13 am
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…