ప్రతీ సంక్రాంతి లానే వచ్చే ఏడాది సంక్రాంతి కి కూడా బడా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. రెండు పెద్ద సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు రెండు థియేటర్స్ లోకి రానున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, తో పాటు తమిళ్ డబ్బింగ్ మూవీస్ విజయ్ ‘వారసుడు’ , అజిత్ ‘తునివు’ సంక్రాంతి స్పెషల్ గా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి.
అయితే పొంగల్ బరిలో ఈ నాలుగు సినిమాలే కాదు తాజాగా మరో రెండు సినిమాలు కూడా లిస్టులో చేరాయి. సంతోష్ శోభన్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘కళ్యాణం కమనీయం’ అనే సినిమా సంక్రాంతి కే రాబోతుంది. కొన్ని రోజుల కిందటే నిర్ణయం తీసుకొని ప్రమోషన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. జనవరి 14న ఈ సినిమాకు రిలీజ్ డేట్ లాకైంది. త్వరలోనే ఫస్ట్ లుక్ లాంచ్ చేసి సంక్రాంతి రిలీజ్ డేట్ అఫీషియల్ గా చెప్పేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
అలాగే జనవరి 14నే సంక్రాంతి కానుకగా వివాహం అనే ఓ చిన్న సినిమా కూడా రాబోతుంది. రాహుల్ విజయ్ , శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎప్పుడో ప్రమోషన్ స్టార్ట్ చేశారు కానీ ఇంత వరకూ ఎలాంటి బజ్ రాలేదు. తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి వేస్తే అంతో ఇంతో మాట్లాడుకుంటారని, థియేటర్స్ తక్కువ వచ్చినా టాక్ బాగుంటే ఆక్యూపెన్సీ బాగుంటుందని భావించి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసేశారు. నాలుగు బడా సినిమాల మధ్యలో సంతోష్ శోభన్ సినిమా అంటే ఏవైనా కాస్త ఆలోచిస్తారేమో కానీ ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు పట్టించుకుంటారా ? డౌటే.
అయితే 2017 లో చిరంజీవి ఖైదీ నంబర్ 150, బాలయ్య ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలతో పాటు రిలీజైన మీడియం రేంజ్ సినిమా శతమానం భవతి ఆ ఏడాది పెద్ద సినిమాల నడుమ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఎవరూ ఊహించని విధంగా శర్వానంద్ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టి తర్వాత థియేటర్స్ పెంచుకుంది. మరి ఇప్పుడు సంతోష్ శోభన్ సినిమా కూడా అలా ఏమైనా అన్ ఎక్స్ పెక్టెడ్ హిట్ అవుతుందేమో చూడాలి. మరి కేవలం నెల రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకెళ్లడం యూవీ సంస్థకి పెద్ద ఛాలేంజే.
This post was last modified on December 7, 2022 8:14 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…