ఆల్రెడీ మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసినా.. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతుండడాన్ని చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీలవుతున్నాడు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. అందుక్కారణం అతను బాలయ్యకు వీరాభిమాని కావడమే. కెరీర్ ఆరంభం నుంచి బాలయ్యతో సినిమా చేయడం తన అని అతను చెబుతూనే ఉన్నాడు.
ఇంతకుముందు ‘రామారావు’ అనే పేరుతో బాలయ్య హీరోగా ఓ సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమైన అనిల్.. ఎట్టకేలకు గత ఏడాది బాలయ్యకు ఓ కొత్త కథ చెప్పి ప్రాజెక్టు ఓకే చేశాడు. ఈ సినిమా ఇప్పటిదాకా మాటల వరకే పరిమితం. అయితే ఇప్పుడు సినిమాను అధికారికంగా ప్రకటించేశారు. ముహూర్త కార్యక్రమం కూడా చేసేస్తున్నారు. గురువారమే బాలయ్య 108వ సినిమాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది.
సినిమా లాంచింగ్ గురించి వెల్లడిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇందులో క్రూ వివరాలన్నీ వెల్లడించేసింది. ముందు నుంచి అనుకుంటున్నట్లే షైన్ స్క్రీన్స్ బేనర్ మీద ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సంస్థలో ఇప్పటికే మజిలీ, కృష్ణార్జున యుద్ధం, గాలి సంపత్, టక్ జగదీష్ లాంటి చిత్రాలు తెరకెక్కాయి. తన రచన, దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘గాలి సంపత్’ సినిమా తేడా కొట్టడంతో షైన్ స్క్రీన్స్ వాళ్లకు ఇంకో సినిమా చేస్తానని అనిల్ మాట ఇచ్చాడు. అందుకు తగ్గట్లే బాలయ్య లాంటి పెద్ద హీరోతో సినిమాను వారికి సెట్ చేసి పెట్టాడు.
ఇక బాలయ్య సినిమాలకు ఈ మధ్య ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన తమనే ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నాడు. అలాగే బాలయ్య ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రాజీవన్ లాంటి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ను ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు అనిల్. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రారంభోత్సవం రోజే టైటిల్ కూడా ప్రకటిస్తారని సమాచారం. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రియాంక జవాల్కర్, ఆయన కూతురిగా శ్రీలీల నటిస్తారని తెలుస్తోంది.
This post was last modified on December 7, 2022 8:02 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…