మామూలుగా ఒక పెద్ద డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిని హీరోలు, నిర్మాతలు నమ్మి సినిమా చేయడానికి ముందుకు రావడం కష్టమే. ఇక అలాంటి దర్శకుడితో తమ హీరో సినిమా చేస్తున్నాడంటే అభిమానులు ఊరుకోరు. సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఉద్యమాలు చేసేస్తుంటారు. ఆ మధ్య మారుతితో ప్రభాస్ సినిమాను అభిమానులు ఎంతగా వ్యతిరేకించారో తెలిసిందే. ఆ దెబ్బకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి కూడా టీం భయపడింది.
ఐతే యువ దర్శకుడు సుజీత్తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ నుంచి ఏమాత్రం వ్యతిరేకత కనిపించడం లేదు. పెద్దగా అనుభవం లేకపోయినా.. ‘సాహో’తో పెద్ద డిజాస్టర్ ఇచ్చినా సుజీత్ను పవన్ ఫ్యాన్స్ నమ్ముతుండడం విశేషమే. ‘సాహో’ అప్పటికి డిజాస్టర్ అయి ఉండొచ్చు కానీ.. కేవలం ఒక చిన్న సినిమా తీసిన అనుభవంతో అంత భారీ ప్రాజెక్టును సుజీత్ బాగానే హ్యాండిల్ చేశాడని చాలామంది నమ్ముతున్నారు.
‘సాహో’ మీద అంచనాలు మరీ ఎక్కువ అయిపోవడం వల్ల.. ఆ సినిమా సంతృప్తిపరచలేకపోయింది కానీ.. అందులో సుజీత్ అండ్ టీం కష్టం కనిపిస్తుంది. అందులో స్టాండౌట్గా నిలిచే సీన్లు చాలా ఉన్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్, యాక్షన్ ఘట్టాలు, స్టైలిష్ టేకింగ్తో సుజీత్ మెప్పించాడు. కథనం మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ‘సాహో’ వేరే లెవెల్ సినిమా అయ్యేదే. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సుజీత్ బాగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. మూడేళ్ల పాటు అతడికి సినిమా లేదు. అయినా సరే నిరాశ చెందకుండా చాలా కసిగా పని చేసి పవన్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడు.
ఈ స్క్రిప్టు పవన్ను తెగ నచ్చేసి.. సుజీత్ను లంచ్కు పిలిచి గౌరవించినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. పవన్తో చేయబోయే సినిమాకు సంబంధించి ప్రి లుక్ పోస్టర్ ద్వారా సుజీత్ బాగానే క్యూరియాసిటీ రేకెత్తించగలిగాడు. పవన్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ విషయంలో చాలా పాజిటివ్గా స్పందిచారు. ఓవరాల్గా ఈ ప్రాజెక్టు విషయంలోనూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘సాహో’ తర్వాత సుజీత్ కసిగా పని చేసి సత్తా చూపిస్తాడని, పవన్ను నెవర్ బిఫోర్ అన్న రీతిలో ప్రెజెంట్ చేస్తాడని వారు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…