మామూలుగా ఒక పెద్ద డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిని హీరోలు, నిర్మాతలు నమ్మి సినిమా చేయడానికి ముందుకు రావడం కష్టమే. ఇక అలాంటి దర్శకుడితో తమ హీరో సినిమా చేస్తున్నాడంటే అభిమానులు ఊరుకోరు. సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఉద్యమాలు చేసేస్తుంటారు. ఆ మధ్య మారుతితో ప్రభాస్ సినిమాను అభిమానులు ఎంతగా వ్యతిరేకించారో తెలిసిందే. ఆ దెబ్బకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి కూడా టీం భయపడింది.
ఐతే యువ దర్శకుడు సుజీత్తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ నుంచి ఏమాత్రం వ్యతిరేకత కనిపించడం లేదు. పెద్దగా అనుభవం లేకపోయినా.. ‘సాహో’తో పెద్ద డిజాస్టర్ ఇచ్చినా సుజీత్ను పవన్ ఫ్యాన్స్ నమ్ముతుండడం విశేషమే. ‘సాహో’ అప్పటికి డిజాస్టర్ అయి ఉండొచ్చు కానీ.. కేవలం ఒక చిన్న సినిమా తీసిన అనుభవంతో అంత భారీ ప్రాజెక్టును సుజీత్ బాగానే హ్యాండిల్ చేశాడని చాలామంది నమ్ముతున్నారు.
‘సాహో’ మీద అంచనాలు మరీ ఎక్కువ అయిపోవడం వల్ల.. ఆ సినిమా సంతృప్తిపరచలేకపోయింది కానీ.. అందులో సుజీత్ అండ్ టీం కష్టం కనిపిస్తుంది. అందులో స్టాండౌట్గా నిలిచే సీన్లు చాలా ఉన్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్, యాక్షన్ ఘట్టాలు, స్టైలిష్ టేకింగ్తో సుజీత్ మెప్పించాడు. కథనం మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ‘సాహో’ వేరే లెవెల్ సినిమా అయ్యేదే. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సుజీత్ బాగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. మూడేళ్ల పాటు అతడికి సినిమా లేదు. అయినా సరే నిరాశ చెందకుండా చాలా కసిగా పని చేసి పవన్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడు.
ఈ స్క్రిప్టు పవన్ను తెగ నచ్చేసి.. సుజీత్ను లంచ్కు పిలిచి గౌరవించినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. పవన్తో చేయబోయే సినిమాకు సంబంధించి ప్రి లుక్ పోస్టర్ ద్వారా సుజీత్ బాగానే క్యూరియాసిటీ రేకెత్తించగలిగాడు. పవన్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ విషయంలో చాలా పాజిటివ్గా స్పందిచారు. ఓవరాల్గా ఈ ప్రాజెక్టు విషయంలోనూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘సాహో’ తర్వాత సుజీత్ కసిగా పని చేసి సత్తా చూపిస్తాడని, పవన్ను నెవర్ బిఫోర్ అన్న రీతిలో ప్రెజెంట్ చేస్తాడని వారు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on December 4, 2022 2:34 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…