మామూలుగా ఒక పెద్ద డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిని హీరోలు, నిర్మాతలు నమ్మి సినిమా చేయడానికి ముందుకు రావడం కష్టమే. ఇక అలాంటి దర్శకుడితో తమ హీరో సినిమా చేస్తున్నాడంటే అభిమానులు ఊరుకోరు. సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఉద్యమాలు చేసేస్తుంటారు. ఆ మధ్య మారుతితో ప్రభాస్ సినిమాను అభిమానులు ఎంతగా వ్యతిరేకించారో తెలిసిందే. ఆ దెబ్బకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి కూడా టీం భయపడింది.
ఐతే యువ దర్శకుడు సుజీత్తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ చేస్తే ఫ్యాన్స్ నుంచి ఏమాత్రం వ్యతిరేకత కనిపించడం లేదు. పెద్దగా అనుభవం లేకపోయినా.. ‘సాహో’తో పెద్ద డిజాస్టర్ ఇచ్చినా సుజీత్ను పవన్ ఫ్యాన్స్ నమ్ముతుండడం విశేషమే. ‘సాహో’ అప్పటికి డిజాస్టర్ అయి ఉండొచ్చు కానీ.. కేవలం ఒక చిన్న సినిమా తీసిన అనుభవంతో అంత భారీ ప్రాజెక్టును సుజీత్ బాగానే హ్యాండిల్ చేశాడని చాలామంది నమ్ముతున్నారు.
‘సాహో’ మీద అంచనాలు మరీ ఎక్కువ అయిపోవడం వల్ల.. ఆ సినిమా సంతృప్తిపరచలేకపోయింది కానీ.. అందులో సుజీత్ అండ్ టీం కష్టం కనిపిస్తుంది. అందులో స్టాండౌట్గా నిలిచే సీన్లు చాలా ఉన్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్, యాక్షన్ ఘట్టాలు, స్టైలిష్ టేకింగ్తో సుజీత్ మెప్పించాడు. కథనం మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ‘సాహో’ వేరే లెవెల్ సినిమా అయ్యేదే. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సుజీత్ బాగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. మూడేళ్ల పాటు అతడికి సినిమా లేదు. అయినా సరే నిరాశ చెందకుండా చాలా కసిగా పని చేసి పవన్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడు.
ఈ స్క్రిప్టు పవన్ను తెగ నచ్చేసి.. సుజీత్ను లంచ్కు పిలిచి గౌరవించినట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. పవన్తో చేయబోయే సినిమాకు సంబంధించి ప్రి లుక్ పోస్టర్ ద్వారా సుజీత్ బాగానే క్యూరియాసిటీ రేకెత్తించగలిగాడు. పవన్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ విషయంలో చాలా పాజిటివ్గా స్పందిచారు. ఓవరాల్గా ఈ ప్రాజెక్టు విషయంలోనూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘సాహో’ తర్వాత సుజీత్ కసిగా పని చేసి సత్తా చూపిస్తాడని, పవన్ను నెవర్ బిఫోర్ అన్న రీతిలో ప్రెజెంట్ చేస్తాడని వారు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…