కరోనా విపత్తు వల్ల చాలా పరిశ్రమలకు కోలుకోలేని నష్టం జరిగింది. ఇందులో సినీ పరిశ్రమకు జరిగిన, జరుగుతోన్న నష్టం వర్ణనాతీతం. హాలీవుడ్, బాలీవుడ్, ఆ వుడ్డు, ఈ వుడ్డు అని లేకుండా అన్ని ఉడ్డులూ కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఈ నష్టాన్ని తట్టుకుని మళ్ళీ కరోనా మునుపటి స్థితికి చిత్ర పరిశ్రమ చేరుకోవాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని అంటున్నారు.
మార్కెట్ పరంగా చాలా మార్పు చేర్పులు వచ్చేస్తాయి కనుక ఖర్చు తగ్గించుకోక తప్పదు. ఈ క్రమంలో హీరోలు పారితోషికం తగ్గించుకుని తీరాల్సిందే. తెలుగు హీరోలెవరూ స్వచ్చంధంగా పారితోషికం తగ్గించుకుంటున్నట్టు చెప్పలేదింకా. బహుశా షూటింగ్ మొదలు పెట్టుకోవచ్చు అన్నప్పుడు మరోసారి లెక్కలు వేసుకుని డిసైడ్ అవుతారేమో.
అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ మాత్రం ఆల్రెడీ తన తదుపరి చిత్రానికి ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చాడట. విజయ్ పారితోషికం అతి భారీ కనుక నిర్మాతకు ఇది చాలా పెద్ద ఉపశమనమే. అయితే ఇరవై శాతం తగ్గింపు సరిపోతుందా లేక మరింత తగ్గించుకోవాలా అనేది ముందు ముందు తెలుస్తుంది.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…