కరోనా విపత్తు వల్ల చాలా పరిశ్రమలకు కోలుకోలేని నష్టం జరిగింది. ఇందులో సినీ పరిశ్రమకు జరిగిన, జరుగుతోన్న నష్టం వర్ణనాతీతం. హాలీవుడ్, బాలీవుడ్, ఆ వుడ్డు, ఈ వుడ్డు అని లేకుండా అన్ని ఉడ్డులూ కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఈ నష్టాన్ని తట్టుకుని మళ్ళీ కరోనా మునుపటి స్థితికి చిత్ర పరిశ్రమ చేరుకోవాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని అంటున్నారు.
మార్కెట్ పరంగా చాలా మార్పు చేర్పులు వచ్చేస్తాయి కనుక ఖర్చు తగ్గించుకోక తప్పదు. ఈ క్రమంలో హీరోలు పారితోషికం తగ్గించుకుని తీరాల్సిందే. తెలుగు హీరోలెవరూ స్వచ్చంధంగా పారితోషికం తగ్గించుకుంటున్నట్టు చెప్పలేదింకా. బహుశా షూటింగ్ మొదలు పెట్టుకోవచ్చు అన్నప్పుడు మరోసారి లెక్కలు వేసుకుని డిసైడ్ అవుతారేమో.
అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ మాత్రం ఆల్రెడీ తన తదుపరి చిత్రానికి ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చాడట. విజయ్ పారితోషికం అతి భారీ కనుక నిర్మాతకు ఇది చాలా పెద్ద ఉపశమనమే. అయితే ఇరవై శాతం తగ్గింపు సరిపోతుందా లేక మరింత తగ్గించుకోవాలా అనేది ముందు ముందు తెలుస్తుంది.
This post was last modified on July 15, 2020 11:14 pm
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…