కరోనా విపత్తు వల్ల చాలా పరిశ్రమలకు కోలుకోలేని నష్టం జరిగింది. ఇందులో సినీ పరిశ్రమకు జరిగిన, జరుగుతోన్న నష్టం వర్ణనాతీతం. హాలీవుడ్, బాలీవుడ్, ఆ వుడ్డు, ఈ వుడ్డు అని లేకుండా అన్ని ఉడ్డులూ కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఈ నష్టాన్ని తట్టుకుని మళ్ళీ కరోనా మునుపటి స్థితికి చిత్ర పరిశ్రమ చేరుకోవాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని అంటున్నారు.
మార్కెట్ పరంగా చాలా మార్పు చేర్పులు వచ్చేస్తాయి కనుక ఖర్చు తగ్గించుకోక తప్పదు. ఈ క్రమంలో హీరోలు పారితోషికం తగ్గించుకుని తీరాల్సిందే. తెలుగు హీరోలెవరూ స్వచ్చంధంగా పారితోషికం తగ్గించుకుంటున్నట్టు చెప్పలేదింకా. బహుశా షూటింగ్ మొదలు పెట్టుకోవచ్చు అన్నప్పుడు మరోసారి లెక్కలు వేసుకుని డిసైడ్ అవుతారేమో.
అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ మాత్రం ఆల్రెడీ తన తదుపరి చిత్రానికి ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చాడట. విజయ్ పారితోషికం అతి భారీ కనుక నిర్మాతకు ఇది చాలా పెద్ద ఉపశమనమే. అయితే ఇరవై శాతం తగ్గింపు సరిపోతుందా లేక మరింత తగ్గించుకోవాలా అనేది ముందు ముందు తెలుస్తుంది.
This post was last modified on July 15, 2020 11:14 pm
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…
న్యాచురల్ స్టార్ నాని డిమాండ్ మాములుగా లేదు. ఊర మాస్ దసరా చేసినా, ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చినా హిట్టుకు…