కరోనా విపత్తు వల్ల చాలా పరిశ్రమలకు కోలుకోలేని నష్టం జరిగింది. ఇందులో సినీ పరిశ్రమకు జరిగిన, జరుగుతోన్న నష్టం వర్ణనాతీతం. హాలీవుడ్, బాలీవుడ్, ఆ వుడ్డు, ఈ వుడ్డు అని లేకుండా అన్ని ఉడ్డులూ కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఈ నష్టాన్ని తట్టుకుని మళ్ళీ కరోనా మునుపటి స్థితికి చిత్ర పరిశ్రమ చేరుకోవాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని అంటున్నారు.
మార్కెట్ పరంగా చాలా మార్పు చేర్పులు వచ్చేస్తాయి కనుక ఖర్చు తగ్గించుకోక తప్పదు. ఈ క్రమంలో హీరోలు పారితోషికం తగ్గించుకుని తీరాల్సిందే. తెలుగు హీరోలెవరూ స్వచ్చంధంగా పారితోషికం తగ్గించుకుంటున్నట్టు చెప్పలేదింకా. బహుశా షూటింగ్ మొదలు పెట్టుకోవచ్చు అన్నప్పుడు మరోసారి లెక్కలు వేసుకుని డిసైడ్ అవుతారేమో.
అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ మాత్రం ఆల్రెడీ తన తదుపరి చిత్రానికి ఇరవై శాతం డిస్కౌంట్ ఇచ్చాడట. విజయ్ పారితోషికం అతి భారీ కనుక నిర్మాతకు ఇది చాలా పెద్ద ఉపశమనమే. అయితే ఇరవై శాతం తగ్గింపు సరిపోతుందా లేక మరింత తగ్గించుకోవాలా అనేది ముందు ముందు తెలుస్తుంది.
This post was last modified on July 15, 2020 11:14 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…