ఈ మధ్య ఏదైనా పెద్ద హీరో ప్రాజెక్టు ప్రకటిస్తే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళేదాకా అది ఖచ్చితంగా ఉంటుందన్న గ్యారెంటీ ఉండటం లేదు. అనౌన్స్ చేశాక నెలల గ్యాప్ వస్తే చాలు మధ్యలో ఎన్నెన్నో జరిగిపోయి ఏకంగా కాంబినేషన్లు మారిపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఈ పరిణామాలు కొత్త ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కలయికలో ప్యాన్ ఇండియా మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది వారం నుంచి తిరుగుతున్న వార్తే అయినప్పటికీ చివరి నిమిషంలో ఏదైనా ట్విస్టు ఉంటుందేమోనని ఎదురుచూసినా నో చేంజ్.
నిజానికీ బుచ్చిబాబు ఇదే కథను తారక్ తో తీయాలని ఉప్పెన టైం నుంచే ప్లానింగ్ లో ఉన్నాడు. కానీ ఆర్ఆర్ఆర్ ఆలస్యంతో పాటు ఆచార్య వ్యవహారాల నుంచి బయటికి వచ్చి స్క్రిప్ట్ ని లాక్ చేయడానికి కొరటాల శివ చాలా టైం తీసుకోవడంతో జూనియర్ కు ఆప్షన్లు తగ్గిపోయాయి. పైగా వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. అది వాయిదా వేయడానికి లేదు. అతని కోసం పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎట్టి పరిస్థితిల్లో వదలకూడదు. అందుకే డ్రాపవ్వడం ఇష్టం లేకపోయినా బుచ్చిబాబును చరణ్ కు రికమండ్ చేశాడనే టాక్ తిరుగుతోంది. అది కూడా ప్రాణ స్నేహితుడు కాబట్టే.
అంతకు ముందు త్రివిక్రమ్ ది కొంత దూరం ప్రయాణం చేశాక వదిలేయడం అది కాస్తా మహేష్ బాబుకి చేరడం జరిగిపోయాయి. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 28 కథ మారి ఉండొచ్చు కానీ అరవింద సమేత వీర రాఘవ లాంటి స్టయిలిష్ ఫ్యాక్షన్ మూవీని ఇచ్చిన కాంబోని మిస్ అయ్యామని ఫ్యాన్స్ ఫీలయ్యారు. సోలో హీరోగా తారక్ ని తెరమీద చూసి నాలుగేళ్లు దాటింది. కొరటాలది 2023లో దసరా లేదా దీపావళికి ముందు వచ్చే ఛాన్స్ లేదు. అంతకన్నా లేట్ అయితే ఆపై ఏడాది సంక్రాంతి తప్ప ఆప్షన్ ఉండదు. ఇంత విలువైన సమయాన్ని ఖర్చు పెట్టిన తారక్ దానికి తగ్గ మంచి ఫలితమే అందుకోవాలి.
This post was last modified on November 29, 2022 10:16 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…