ఈ మధ్య ఏదైనా పెద్ద హీరో ప్రాజెక్టు ప్రకటిస్తే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళేదాకా అది ఖచ్చితంగా ఉంటుందన్న గ్యారెంటీ ఉండటం లేదు. అనౌన్స్ చేశాక నెలల గ్యాప్ వస్తే చాలు మధ్యలో ఎన్నెన్నో జరిగిపోయి ఏకంగా కాంబినేషన్లు మారిపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఈ పరిణామాలు కొత్త ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కలయికలో ప్యాన్ ఇండియా మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది వారం నుంచి తిరుగుతున్న వార్తే అయినప్పటికీ చివరి నిమిషంలో ఏదైనా ట్విస్టు ఉంటుందేమోనని ఎదురుచూసినా నో చేంజ్.
నిజానికీ బుచ్చిబాబు ఇదే కథను తారక్ తో తీయాలని ఉప్పెన టైం నుంచే ప్లానింగ్ లో ఉన్నాడు. కానీ ఆర్ఆర్ఆర్ ఆలస్యంతో పాటు ఆచార్య వ్యవహారాల నుంచి బయటికి వచ్చి స్క్రిప్ట్ ని లాక్ చేయడానికి కొరటాల శివ చాలా టైం తీసుకోవడంతో జూనియర్ కు ఆప్షన్లు తగ్గిపోయాయి. పైగా వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. అది వాయిదా వేయడానికి లేదు. అతని కోసం పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎట్టి పరిస్థితిల్లో వదలకూడదు. అందుకే డ్రాపవ్వడం ఇష్టం లేకపోయినా బుచ్చిబాబును చరణ్ కు రికమండ్ చేశాడనే టాక్ తిరుగుతోంది. అది కూడా ప్రాణ స్నేహితుడు కాబట్టే.
అంతకు ముందు త్రివిక్రమ్ ది కొంత దూరం ప్రయాణం చేశాక వదిలేయడం అది కాస్తా మహేష్ బాబుకి చేరడం జరిగిపోయాయి. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 28 కథ మారి ఉండొచ్చు కానీ అరవింద సమేత వీర రాఘవ లాంటి స్టయిలిష్ ఫ్యాక్షన్ మూవీని ఇచ్చిన కాంబోని మిస్ అయ్యామని ఫ్యాన్స్ ఫీలయ్యారు. సోలో హీరోగా తారక్ ని తెరమీద చూసి నాలుగేళ్లు దాటింది. కొరటాలది 2023లో దసరా లేదా దీపావళికి ముందు వచ్చే ఛాన్స్ లేదు. అంతకన్నా లేట్ అయితే ఆపై ఏడాది సంక్రాంతి తప్ప ఆప్షన్ ఉండదు. ఇంత విలువైన సమయాన్ని ఖర్చు పెట్టిన తారక్ దానికి తగ్గ మంచి ఫలితమే అందుకోవాలి.
This post was last modified on November 29, 2022 10:16 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…