ఈ మధ్య ఏదైనా పెద్ద హీరో ప్రాజెక్టు ప్రకటిస్తే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళేదాకా అది ఖచ్చితంగా ఉంటుందన్న గ్యారెంటీ ఉండటం లేదు. అనౌన్స్ చేశాక నెలల గ్యాప్ వస్తే చాలు మధ్యలో ఎన్నెన్నో జరిగిపోయి ఏకంగా కాంబినేషన్లు మారిపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఈ పరిణామాలు కొత్త ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కలయికలో ప్యాన్ ఇండియా మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది వారం నుంచి తిరుగుతున్న వార్తే అయినప్పటికీ చివరి నిమిషంలో ఏదైనా ట్విస్టు ఉంటుందేమోనని ఎదురుచూసినా నో చేంజ్.
నిజానికీ బుచ్చిబాబు ఇదే కథను తారక్ తో తీయాలని ఉప్పెన టైం నుంచే ప్లానింగ్ లో ఉన్నాడు. కానీ ఆర్ఆర్ఆర్ ఆలస్యంతో పాటు ఆచార్య వ్యవహారాల నుంచి బయటికి వచ్చి స్క్రిప్ట్ ని లాక్ చేయడానికి కొరటాల శివ చాలా టైం తీసుకోవడంతో జూనియర్ కు ఆప్షన్లు తగ్గిపోయాయి. పైగా వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. అది వాయిదా వేయడానికి లేదు. అతని కోసం పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎట్టి పరిస్థితిల్లో వదలకూడదు. అందుకే డ్రాపవ్వడం ఇష్టం లేకపోయినా బుచ్చిబాబును చరణ్ కు రికమండ్ చేశాడనే టాక్ తిరుగుతోంది. అది కూడా ప్రాణ స్నేహితుడు కాబట్టే.
అంతకు ముందు త్రివిక్రమ్ ది కొంత దూరం ప్రయాణం చేశాక వదిలేయడం అది కాస్తా మహేష్ బాబుకి చేరడం జరిగిపోయాయి. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 28 కథ మారి ఉండొచ్చు కానీ అరవింద సమేత వీర రాఘవ లాంటి స్టయిలిష్ ఫ్యాక్షన్ మూవీని ఇచ్చిన కాంబోని మిస్ అయ్యామని ఫ్యాన్స్ ఫీలయ్యారు. సోలో హీరోగా తారక్ ని తెరమీద చూసి నాలుగేళ్లు దాటింది. కొరటాలది 2023లో దసరా లేదా దీపావళికి ముందు వచ్చే ఛాన్స్ లేదు. అంతకన్నా లేట్ అయితే ఆపై ఏడాది సంక్రాంతి తప్ప ఆప్షన్ ఉండదు. ఇంత విలువైన సమయాన్ని ఖర్చు పెట్టిన తారక్ దానికి తగ్గ మంచి ఫలితమే అందుకోవాలి.
This post was last modified on November 29, 2022 10:16 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…