Movie News

‘ప్రాజెక్ట్-కే’ కష్టాలపై నాగ్ అశ్విన్

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న అత్యంత భారీ, మోస్ట్ యాంబిషియ‌స్ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్-కె ఒక‌టి. మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ రూ.500 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్లో నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కే రెండేళ్లు ప‌ట్టింది. షూటింగ్ కూడా చాలా శ్ర‌మ‌తో కూడుకున్న‌దే.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా భారీగానే ఉండ‌బోతోంది. ఇది హాలీవుడ్ ఎవెంజ‌ర్స్ త‌ర‌హా ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్ ట‌చ్ ఉన్న సినిమా. విజువ‌ల్ ఎఫెక్స్ట్ ప్ర‌పంచ స్థాయిలోనే ఉండ‌బోతున్నాయి. ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మ‌రో ప్రపంచంలోకి తీసుకెళ్తామ‌ని.. ఇది పాన్ వ‌ర‌ల్డ్ సినిమా అని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సినిమా కోసం తాము ప‌డుతున్న క‌ష్టాన్ని వివ‌రించాడు.

ప్రాజెక్ట్-కె సినిమా కొత్త‌ద‌ని.. అలాగే స్క్రిప్టు కూడా చాలా విభిన్నంగా ఉంటుంద‌ని, ఈ సినిమాకు అన్నీ సిద్ధం చేస్తున్న టెక్నీషియ‌న్లు కూడా కొత్త వాళ్లే అని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఒక ర‌కంగా ఈ సినిమా ఎలా చేయాలి అనేది ఆలోచించ‌డానికే చాలా స‌మ‌యం ప‌డుతోంద‌ని అత‌ను చెప్పాడు. సినిమాకు సంబంధించి ఏదీ రెడీ మేడ్‌గా దొర‌క‌ద‌ని.. ప్ర‌తిదీ సున్నా నుంచి రెడీ చేసుకుంటున్నామ‌ని నాగ్ అశ్విన్ వెల్ల‌డించాడు.

మ‌హాన‌టి సినిమా కోసం వింటేజ్ కార్లు కావాలంటే ఎక్క‌డో ఓ చోట వెతికి రెంటుకు తెచ్చుకున్నామ‌ని.. కానీ ప్రాజెక్ట్-కె కోసం ఉప‌యోగిస్తున్న వాహ‌నాలు ఏవీ కూడా ఎక్క‌డా దొర‌క‌వ‌ని.. వాటిని తామే అవ‌స‌ర‌మైన మేర‌కు త‌యారుచేయించుకున్నామ‌ని నాగి తెలిపాడు. ఒక‌టి మాత్రం క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌న‌ని.. ఈ సినిమా చాలా కొత్త‌గా ఉంటుంద‌ని, ప్రేక్ష‌కుల‌ను మ‌రో లోకంలోకి తీసుకెళ్తుంద‌ని నాగ్ అశ్విన్ చెప్పాడు.

This post was last modified on November 21, 2022 6:54 am

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

4 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

5 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

5 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

5 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

5 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

5 hours ago