బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న అత్యంత భారీ, మోస్ట్ యాంబిషియస్ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్-కె ఒకటి. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ రూ.500 కోట్లకు పైగా బడ్జెట్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులకే రెండేళ్లు పట్టింది. షూటింగ్ కూడా చాలా శ్రమతో కూడుకున్నదే.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా భారీగానే ఉండబోతోంది. ఇది హాలీవుడ్ ఎవెంజర్స్ తరహా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న సినిమా. విజువల్ ఎఫెక్స్ట్ ప్రపంచ స్థాయిలోనే ఉండబోతున్నాయి. ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తామని.. ఇది పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా కోసం తాము పడుతున్న కష్టాన్ని వివరించాడు.
ప్రాజెక్ట్-కె సినిమా కొత్తదని.. అలాగే స్క్రిప్టు కూడా చాలా విభిన్నంగా ఉంటుందని, ఈ సినిమాకు అన్నీ సిద్ధం చేస్తున్న టెక్నీషియన్లు కూడా కొత్త వాళ్లే అని నాగ్ అశ్విన్ తెలిపాడు. ఒక రకంగా ఈ సినిమా ఎలా చేయాలి అనేది ఆలోచించడానికే చాలా సమయం పడుతోందని అతను చెప్పాడు. సినిమాకు సంబంధించి ఏదీ రెడీ మేడ్గా దొరకదని.. ప్రతిదీ సున్నా నుంచి రెడీ చేసుకుంటున్నామని నాగ్ అశ్విన్ వెల్లడించాడు.
మహానటి సినిమా కోసం వింటేజ్ కార్లు కావాలంటే ఎక్కడో ఓ చోట వెతికి రెంటుకు తెచ్చుకున్నామని.. కానీ ప్రాజెక్ట్-కె కోసం ఉపయోగిస్తున్న వాహనాలు ఏవీ కూడా ఎక్కడా దొరకవని.. వాటిని తామే అవసరమైన మేరకు తయారుచేయించుకున్నామని నాగి తెలిపాడు. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలనని.. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తుందని నాగ్ అశ్విన్ చెప్పాడు.
This post was last modified on November 21, 2022 6:54 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…